పసి హృదయాలకు భరోసా
చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 350 పడకల ఆస్పత్రిని రూ.320 కోట్లతో తితిదే నిర్మిస్తోంది. ఏడాదిలో అందుబాటులోకి వచ్చే ఆస్పత్రిలో గుండె, న్యూరాలజీ, కాలేయం, గ్యాస్ట్రో, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులకు చికిత్స అందించనున్నారు.
రూ.320 కోట్లతో 350 పడకల ఆస్పత్రి
న్యూస్టుడే, తిరుపతి(వైద్యం)
ప్రతి వెయ్యి మందిలో పదిమంది శిశువులు ఏదో ఒక గుండె సమస్యతో జన్మిస్తున్నారు. వారిలో మూడోవంతు మందికి మొదటి సంవత్సరంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తేనే బతుకుతారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చేసే ఈ శస్త్ర చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు చేయలేక చాలా మంది మదన పడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రిని తితిదే నెలకొల్పింది. ఏర్పాటు చేసిన 17 నెలల్లో సుమారు 1,200 శస్త్ర చికిత్సలు చేశారు. అందులో 96 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నారు.
కేవలం గుండె జబ్బులకే కాకుండా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అతిపెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో గుండెతోపాటు కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.
నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి
చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 350 పడకల ఆస్పత్రిని రూ.320 కోట్లతో తితిదే నిర్మిస్తోంది. ఏడాదిలో అందుబాటులోకి వచ్చే ఆస్పత్రిలో గుండె, న్యూరాలజీ, కాలేయం, గ్యాస్ట్రో, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులకు చికిత్స అందించనున్నారు. దాదాపు పది విభాగాల నిర్వహణ నిమిత్తం అదనంగా 30- 40 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించుకోనున్నారు. కొన్ని రక్త పరీక్షలకు చెన్నై, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అధునాతన ట్యాబోరేటరీ.. 11 ఆపరేషన్ థియేటర్లు.. ప్రతి విభాగంలో ఐసీయూ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏడు అంతస్తుల ఆస్పత్రిలో ఒక ఫ్లోర్లో అవయవాల మార్పిడికి వినియోగించనున్నారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. దాతల నుంచి అవయవాల స్వీకరణ చేపట్టనున్నారు.
గ్రీన్ ఛానల్ అవసరం లేకుండా..
ఎక్కడో బ్రెయిన్డెడ్ అయినవారి అవయవాలు తిరుపతికి తీసుకురావాలంటే గ్రీన్ ఛానల్ భద్రత అవసరం. అవయవాలు రోడ్డు మార్గం ద్వారా సకాలంలో తీసుకొచ్చేందుకు గ్రీన్ ఛానల్ అవసరం. ఈ ప్రక్రియ వల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. కొత్త ఆస్పత్రి భవనంపై హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి అవయవాలను హెలికాప్టర్ ద్వారా నేరుగా ఆస్పత్రిలోకి తీసుకురావచ్చు. ఇక్కడ నుంచి కూడా అవయవాలు తీసుకెళ్లనున్నారు.
అవయవ దానంపై అవగాహన పెరగాలి
- డాక్టర్ నరహరి శ్రీనాథ్ రెడ్డి, సంచాలకులు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం
పుట్టిన బిడ్డలు బరువు పెరగక పోవడం.. పాలు తాగితే ఆయాస పడటం.. పెదాలు, చేతులు నీలిరంగులో మారే లక్షణాలు ఉంటే వెంటనే చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొస్తే కోలుకునే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్ది గుండె పదిలం కాకపోతే చివరగా గుండె మార్పిడే శరణ్యం. 1967లో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు మొదలైనా.. ప్రజల్లో మరింతగా అవగాహన పెరగాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం