హద్దులు దాటి ఆక్రమణలు
చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంకు లెవల్) నిర్ధారణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. పట్టణాల్లోని చెరువులు రూపు కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారుల ఉదాసీనత కాగా కొందరు ప్రజాప్రతినిధులు ఇందుకు సహకారం
పట్టణాల్లో రూపు కోల్పోతున్న చెరువులు
ఎఫ్టీఎల్ నిర్ధారణలో నిర్లక్ష్యం
పెళ్లకూరు, న్యూస్టుడే : చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంకు లెవల్) నిర్ధారణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. పట్టణాల్లోని చెరువులు రూపు కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారుల ఉదాసీనత కాగా కొందరు ప్రజాప్రతినిధులు ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చాలావరకు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో చేరగా మరికొన్నింటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎత్తుగడ వేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారిని ఆనుకుని అనేక చెరువుల హద్దులు చెరిపేస్తున్నారు.
16 ఎకరాల్లో ఉండాల్సిన తాళ్వాయపాడు చెరువు ఇలా..
పెళ్లకూరు మండలంలో 35 చిన్న నీటిపారుదల చెరువులు ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా ఉన్న తాళ్వాయపాడు సర్వే నం.79-91 వరకు చెరువు 16.51 ఎకరాల విస్తీర్ణం కాగా ఇక్కడ ఆరేడు ఎకరాలకు పరిమితమైంది. దీనిపై ఫిర్యాదులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల భూసర్వే చేసినా హద్దులేర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పెన్నేపల్లిలో సర్వే నంబరు 108-114 వరకు 105.95 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఆక్రమణలకు గురైంది.
గూడూరు రెవెన్యూ డివిజన్లో 616, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్లో 437 చిన్న నీటిపారుదల చెరువులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాల్లో ఆక్రమణకు గురయ్యాయి. వాగులు, పంట కాలువలు జాడ లేదు. ఆయా ప్రాంతాల్లోని జలవనరుల శాఖ అధికారులు ఎఫ్టీఎల్ ఎప్పటికప్పుడు నిర్ధారించి హద్దులేర్పాటు చేయాల్సి ఉంది. అటు రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు, జలవనరుల శాఖ సంయుక్తంగా వీటిని అమలు చేయాల్సి ఉంది. చాలాచోట్ల వీటి గురించి ఆయా శాఖలు పట్టింపులేక జలవనరులు పెద్దల చేతుల్లో చేరి వరదల సమయంలో ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
93.44 ఎకరాలు ఉండాల్సిన నాయుడుపేట ఎల్ఏ సాగరం చెరువు దుస్థితి
నాయుడుపేట మండలంలో 63 చిన్ననీటి పారుదల చెరువులు ఉండగా వీటికి 4,420 హెక్టార్ల ఆయకట్టు ఉంది. పట్టణ పరిధిలోని ఎల్ఏ సాగరం పరిధిలో చెరువు కట్ట అంచు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఓదఫా ఆక్రమణలు తొలగించినా మళ్లీ కాంక్రీట్ నిర్మాణాలు వెలిశాయి. చెరువు సర్వే నంబరు 109 నుంచి 161 వరకు 93.44 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సమీపంలోని భూయజమానులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు మాయం చేస్తున్నారు. సర్వే నంబరు 114 నుంచి 139 వరకు సుమారుగా కాలువ పోరంబోకు 17.61 ఎకరాల భూమి ఎక్కడుందో తెలియని దుస్థితి.
నిర్ధారణకు చర్యలు
- సురేష్బాబు, కార్యనిర్వాహక ఇంజినీర్, గూడూరు
జలవనరుల శాఖ పరిధిలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు చర్యలు తీసుకుంటాం. రీసర్వే నేపథ్యంలో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపడుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!