logo

నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్‌రోడ్డు సమీపంలోని హెలిపాడ్‌ చేరుకుంటారు.

Published : 20 Apr 2024 03:14 IST

సత్యవేడు సభలో ప్రసంగించనున్న చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్‌రోడ్డు సమీపంలోని హెలిపాడ్‌ చేరుకుంటారు. ఆపై రోడ్డు మార్గంలో గూడూరు సీఆర్‌ కల్యాణ మండపం చేరుకొని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మహిళలతో సమావేశమవుతారు. అనంతరం హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 5:20 గంటలకు సత్యవేడు చేరుకుంటారు. స్థానిక క్లాక్‌ టవర్‌ వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 గంటల వరకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో రేణిగుంట చేరుకొని విమానంలో విజయవాడ బయలుదేరుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని