కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
త్రిరాష్ట్ర కూడలిలో వేరే జెండా ఎగరడానికి వీళ్లేదు: నారా భువనేశ్వరి
విరాళాలతో ధరావతు సొమ్ము చెల్లింపు
పసుపుమయమైన పట్టణం
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నారా భువనేశ్వరి
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘కుప్పం అంటే తెలుగుదేశం.. పార్టీ స్థాపించినప్పటి నుంచి వేరే జెండా ఎగరలేదు.. ఇకపైనా ఎగరకూడదు.. కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా.. మిగిలిన జెండాలు వచ్చేందుకే భయపడాలి.. ఇంకొకరు రావడానికి ధైర్యం చేయకూడదు.. అదే నేను కోరుతున్నా.. వైకాపాను తరిమేసి.. వారి ధైర్యాన్ని తరిమికొట్టండి’ అంటూ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామపత్రం దాఖలు సందర్భంగా వచ్చిన జన సంద్రాన్ని ఉత్తేజపరిచే విధంగా అధినేత్రి నారా భువనేశ్వరి ప్రసంగం సాగింది. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన వేలాది మంది తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆమె మాట్లాడారు. రాష్ట్రం కోసం పోరాడదాం.. వైకాపా రాక్షస పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. వైకాపా నేతల దోపిడీకి అడ్డుపడిన తెదేపా కార్యాకర్తలను దారుణంగా చంపారు, వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలు, మతాలు వేరైనా.. మనమంతా ఆంధ్రులమని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. దేశం మెచ్చిన నాయకుడు చంద్రబాబుకి మరింత గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత కుప్పం కుటుంబంపై ఉందన్నారు. ఆయనకు లక్ష మెజారిటీ బహుమతిగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. సుమారు 40 వేల మంది హాజరు కావడంతో పట్టణమంతా పసుపుమయంగా మారింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ఇన్ఛార్జి మునిరత్నం, పీఏ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, సురేష్బాబు, భాజపా ఇన్ఛార్జి శివశంకర్, జనసేన ఇన్ఛార్జి నరేష్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో భద్రత బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధినేతకు అండగా..
చంద్రబాబు నాయుడు నామపత్రం దాఖలు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దివ్యాంగులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు తరలివచ్చారు. వారంతా విరాళాలను నారా భువనేశ్వరికి అందించారు. ప్రత్యేక ప్రతిభావంతులు కందుకూరుకు చెందిన అశోక్, ఏలూరుకు చెందిన జాకోబ్, ప్రకాశం జిల్లాకు చెందిన బాలు, బాపట్ల నుంచి అనిల్, గుంటూరుకు చెందిన సాయి, నెల్లూరుకు చెందిన గోపీ, చిట్టిబాబు తమవంతుగా ఒక్కొక్కరూ రూ.200 చొప్పున అందించారు.
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి దువా, బాబునగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.
ర్యాలీలో వృద్ధుల ఉత్సాహం
వరదరాజులస్వామి ఆశీసుల్లతో..
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి దువా, బాబునగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సాగుదారు.. జగన్ హక్కుదారు
[ 02-05-2024]
జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. -
పప్పన్నం లేనట్లే..
[ 02-05-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప. -
పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
[ 02-05-2024]
-
పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
[ 02-05-2024]
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. -
ఎ‘వరి’కి చెప్పుకోవాలో
[ 02-05-2024]
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నాయి జగన్...
[ 02-05-2024]
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. -
కర్రలు, రాళ్లతో వెంటాడి..
[ 02-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. -
మేనిఫెస్టోలో భాజపా చిత్రాలేవి: మంత్రి పెద్దిరెడ్డి
[ 02-05-2024]
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
[ 02-05-2024]
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. -
వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!
[ 02-05-2024]
ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు -
పోలీసులకు ఒక్కరోజే..!
[ 02-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మొదటి రోజు విలపింఛెన్దారులు
[ 02-05-2024]
ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, -
హామీల వలలో మున్సి‘పల్టీలు’
[ 02-05-2024]
ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..