logo

రెచ్చగొట్టి దాడిచేశారు

రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Published : 10 May 2024 02:59 IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాష్టీకం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరినాథ్‌

ఏర్పేడు, న్యూస్‌టుడే: రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు సుధీర్‌, జీవాతో పాటు 14 మంది ఎన్నికల ప్రచారం పేరుతో పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలతో శబ్దం చేస్తూ తెదేపా కార్యకర్తల ఇంటి ముందు కేకలు వేశారు. దీనిపై గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త హరినాథ్‌ ప్రశ్నించడంతో వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగి గాయపరిచారు. సమాచారం అందుకున్న ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన హరినాథ్‌ను వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి గ్రామానికి చేరుకుని తెదేపా కార్యకర్తలను అరెస్ట్‌ చేయాలని పట్టుబట్టడంతో పోలీసులు ఐదుగురు తెదేపా కార్యకర్తలను స్టేషన్‌కి తరలించారు. గురువారం మండలంలోని తెదేపా నేతలు స్టేషన్‌ వద్దకు చేరుకుని దాడి చేసిన వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేయడంతో పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని