logo

స్వచ్ఛ కాకినాడకు ప్రతిఒక్కరూ సహకరించాలి: ఎమ్మెల్యే

స్వచ్ఛ కాకినాడకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కోరారు. శనివారం స్థానిక వైకాపా కార్యాలయం వద్ద స్వచ్చ సర్వేక్షన్‌ కింద నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్ల మధ్య నిర్వహించిన పోటీలో మొదటి

Published : 23 Jan 2022 02:59 IST


పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్తాలు అందజేస్తూ..

బాలాజీచెరువు, న్యూస్‌టుడే: స్వచ్ఛ కాకినాడకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కోరారు. శనివారం స్థానిక వైకాపా కార్యాలయం వద్ద స్వచ్చ సర్వేక్షన్‌ కింద నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్ల మధ్య నిర్వహించిన పోటీలో మొదటి స్థానంలో నిలిచిన 41వ డివిజన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేటర్‌ గోతి సత్యవతితో కలిసి ఆయన నూతన వస్త్రాలు పంపిణీ చేసి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సుంకర శివప్రసన్న, కార్పొరేటర్లు గోడి సత్యవతి, నల్లబిల్లి సుజాత, వైకాపా నాయకుడు గోడి సత్యవతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లాజరు, వర్మ, శానిటరీ సెక్రటరీలు ఫర్జానా, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని