logo

కూరకోసం గొడవపడి.. బలవన్మరణం

బోడసకుర్రు వైనతేయ వారధి వద్ద ఓ వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఆదివారం తెలిపారు. అమలాపురం మున్సిపల్‌కాలనీకి చెందిన అంకాడి దుర్గాప్రసాద్‌(38) బోడసకుర్రులో నివాసం ఉంటున్నాడు. శనివారం

Published : 24 Jan 2022 05:04 IST


నాగేశ్వరరావు

 

అల్లవరం, న్యూస్‌టుడే: బోడసకుర్రు వైనతేయ వారధి వద్ద ఓ వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఆదివారం తెలిపారు. అమలాపురం మున్సిపల్‌కాలనీకి చెందిన అంకాడి దుర్గాప్రసాద్‌(38) బోడసకుర్రులో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంటివద్ద కూర విషయంలో భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వైనతేయ వారధి రెండో పిల్లరు వద్ద రెయిలింగ్‌కు చీరతో ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని