logo

వైకాపా నేతపై కత్తితో దాడి

సామర్లకోట మండల జడ్పీటీసీ సభ్యురాలు ఎలిశెట్టి అమృత భర్త, వైకాపా నాయకుడు నరేష్‌పై ఆదే గ్రామానికి చెందిన ఎ.రాంగోపాల కత్తితో దాడి చేయడంతో ఆయన చేతికి తీవ్ర గాయమయ్యింది.

Published : 17 Aug 2022 06:14 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్‌

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: సామర్లకోట మండల జడ్పీటీసీ సభ్యురాలు ఎలిశెట్టి అమృత భర్త, వైకాపా నాయకుడు నరేష్‌పై ఆదే గ్రామానికి చెందిన ఎ.రాంగోపాల కత్తితో దాడి చేయడంతో ఆయన చేతికి తీవ్ర గాయమయ్యింది. తిమ్మాపురం ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం గ్రామంలో వివాహానికి హాజరై స్నేహితులు, బంధువులతో రోడ్డుపై నరేష్‌ ఉండగా, రాంగోపాల్‌ ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తితో ఆకస్మికంగా దాడి చేసి పరారయ్యాడు. దాడి నుంచి తప్పించుకునేందుకు చేతిని అడ్డుపెట్టుకోవటంతో గాయపడిన నరేష్‌ను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య పొలానికి సంబంధించి తగాదా ఉంది. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నట్లు తిమ్మాపురం ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని