logo

‘మండలానికో అన్న క్యాంటీన్‌’

తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలానికో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం మండల తెదేపా ఆధ్వర్యంలో ముక్తేశ్వరంలో

Published : 25 Sep 2022 03:11 IST

ముక్తేశ్వరంలో భోజనం వడ్డిస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం

అయినవిల్లి, న్యూస్‌టుడే: తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలానికో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం మండల తెదేపా ఆధ్వర్యంలో ముక్తేశ్వరంలో తొత్తరమూడి తెదేపా గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కిన బాబి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కడుపు నింపేందుకు తెదేపా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే ఓర్వలేక వైకాపా ప్రభుత్వం వాటిని కూల్చివేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శులు నామన రాంబాబు, డొక్కా జగన్నాథం, మెట్ల రమణబాబు, మండల తెదేపా అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు కళ్లెపల్లి వెంకట సుబ్బరాజు, పార్టీ కార్యదర్శి కుడిపూడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని