2.. 8.. 9
దోషరహిత ఓటర్ల జాబితా దిశగా కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాల్లో ఓటు-ఆధార్ అనుసంధానానికి ఆగస్టు ఒకటి నుంచి శ్రీకారం చుట్టారు.
ఓటు-ఆధార్ అనుసంధానంలో మూడు జిల్లాల స్థానాలు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్, అమలాపురం(అల్లవరం), రాజమహేంద్రవరం(వీఎల్ పురం)
దోషరహిత ఓటర్ల జాబితా దిశగా కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాల్లో ఓటు-ఆధార్ అనుసంధానానికి ఆగస్టు ఒకటి నుంచి శ్రీకారం చుట్టారు. బూత్స్థాయి అధికారులు(బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు సేకరించి, ఫారం-6బీలో పొందుపరుస్తున్నారు. ఆధార్ సేకరణలో బలవంతం లేదని, స్వచ్ఛందంగా సీడింగ్ చేసుకోవచ్చునని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు-ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకుంటున్నారు. మూడు జిల్లాల పరిధిలో 60 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పోల్చితే.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 76.66 శాతంతో రెండో స్థానం, తూర్పుగోదావరి జిల్లా 67.71 శాతంతో 8వ స్థానం, కాకినాడ జిల్లా 66.30 శాతంతో 9వ స్థానంలో ఉన్నాయి. 2023 మార్చి 31 వరకు గడువు ఇచ్చినా... మూడు జిల్లాల కలెక్టర్లు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు వెనుకబడగా.. వాటిని ముందు వరుసలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
కాకినాడ నగర నియోజకవర్గంలో ఆధార్ సేకరణకు నిర్వహించిన ప్రత్యేక శిబిరం
ప్రత్యేక శిబిరాలతో..
* మూడు జిల్లాల్లోని 4,834 పోలింగ్ కేంద్రాల్లో ఓటు-ఆధార్ అనుసంధానానికి సెప్టెంబరు 4, నవంబరు 11న ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియలో ఈనెల 19, 20 తేదీల్లో కూడా వివరాలు సేకరించారు.
* అనుసంధానంలో గ్రామ/వార్డు వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు(ఈఆర్వో) ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నిచోట్ల వారిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
* ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకే ఫొటోతో రెండు ఓట్లు(ఫొటో సిమిలర్ ఎంట్రీస్)ను గుర్తించారు. వీటిని ఇప్పటికే తొలగించారు.
* మూడు జిల్లాల్లో నవంబరు 9 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023 చేపట్టారు. కొత్తగా ఓటు హక్కు కల్పించడానికి అవకాశంమిచ్చారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. చేర్పులు, మార్పులు, తొలగింపు, బదిలీకి అవకాశం ఇచ్చారు. డిసెంబరు 8 వరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. nvsp.in, voter portal వెబ్సైట్లు, voter helpline యాప్లో అర్హులు ఓటు నమోదు చేసుకోవచ్చు.
ఓటర్లు సహకరించాలి
- జి.నరసింహులు, జిల్లా రెవెన్యూ అధికారి, తూర్పుగోదావరి జిల్లా
ఇంటింటికి ఆధార్ సేకరణకు వచ్చే బీఎల్వోలకు ఓటర్లు సహకరించాలి. సకాలంలో ఆధార్ సంఖ్యకు సంబంధించిన వివరాలు అందజేసి, అనుసంధాన ప్రక్రియ పూర్తికి తోడ్పాటు అందించాలి. గడువులోగా ప్రక్రియను నూరుశాతం పూర్తి చేస్తాం. డిసెంబరు నెలాఖరు నాటికి దీన్ని ముగిస్తాం.. కలెక్టర్ ఆదేశాలతో ఈఆర్వోలు, బీఎల్వోలను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాను మెరుగైన స్థానంలో నిలుపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం