డ్వాక్రా మహిళలతో రక్షిత వ్యవసాయం
జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో రక్షిత వ్యవసాయం (షేడ్ నెట్స్) యూనిట్లు నెలకొల్పి.. వారంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉద్యాన పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో రక్షిత వ్యవసాయం (షేడ్ నెట్స్) యూనిట్లు నెలకొల్పి.. వారంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉద్యాన పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు. మహిళా స్వయం సమృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో షేడ్నెట్స్ యూనిట్లు నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల నుంచి పంటలను పరిరక్షించడం ద్వారా అధిక దిగుబడే లక్ష్యంగా, ఆదాయ కల్పన దిశగా చర్యలు చేపడుతున్నారు. పెట్టుబడి నష్టపోకుండా, ప్రయోజనం పొందేలా రక్షిత వ్యవసాయం చేసేలా డ్వాక్రా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.
రూ.1.98 లక్షల రాయితీ..
కాకినాడ జిల్లాలో నాలుగు కస్టర్లుండగా ఒక్కో క్లస్టర్లో కనీసం 20 షెడ్నెట్ యూనిట్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.4.50 లక్షలుగా నిర్ధారించగా, దీనిలో రూ.1.98 లక్షలు రాయితీ కల్పించనున్నారు. పది శాతం వాటా లబ్ధిదారులు భరించాలి. మిగతా మొత్తం బ్యాంకు రుణంగా కల్పించనున్నారు. షేడ్ నెట్ వ్యవసాయంలో విదేశాల్లో ఉన్న అధునాత విధానాలను ఇక్కడ అవలంబించడం ద్వారా అధిక ఆదాయం పొందేలా డ్వాక్రా మహిళలను ప్రోత్సహించనున్నారు.
పలు సంస్థలతో ఒప్పందం
ఈ పథకం అమలుకు సంబంధించి 12.50 సెంట్ల సొంత స్థలం ఉన్న మహిళలకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు మహేంద్ర టాప్, కేతి కంపెనీలతో సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే పిఠాపురం ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఇటీవల అవగాహన సదస్సు నిర్వహించగా, ఆరుగురు ముందుకొచ్చారు. సామర్లకోట మండలంలో నలుగురు, పిఠాపురం, జగ్గంపేట మండలంలో ఒక్కరు చొప్పున రక్షిత వ్యవసాయ సాగుకు అంగీకారం తెలిపారు. వీరికి సంబంధించిన స్థలాలకు భూసార, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివాహాది శుభకార్యాల్లో అలంకరణ చేసే ఖరీదైన పువ్వులు, ఆకుకూరలు, కాయగూరలు తదితర ఉద్యాన పంటలను షేడ్నెట్స్ ద్వారా పండించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంటలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మహేంద్ర టాప్ కంపెనీ చేస్తుంది. పౌల్ట్రీలు, రసాయన ఎరువులు పిచికారీ చేసే ప్రాంతాలు కాకుండా వెలుతురు, గాలీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే రక్షిత వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. నీటిలో పీహెచ్ శాతం ఒకటి కన్నా తక్కువగా ఉంటేనే అనుమతిస్తారు. డ్వాక్రా మహిళలను అధునాత వ్యవసాయ విధానం వైపు నడిపించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.
సెర్ప్ అధికారులతో..
రక్షిత వ్యవసాయంపై ఆసక్తి, అర్హత ఉన్న డ్వాక్రా మహిళల కుటుంబ సభ్యులు మండలంలోని సెర్ప్ ఎంపీఎంను సంప్రదించాలి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నాం. చేయూత మహిళా మార్ట్లను నెలకొల్పాం. షేడ్నెట్ వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరిని గుర్తించి, కొన్ని యూనిట్లు మంజూరు చేశాం. మరిన్ని యూనిట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం.
కె.శ్రీరమణి, పథకం సంచాలకులు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం