logo

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి

యర్నగూడెం గండి చెరువు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 21 Mar 2023 05:18 IST

మనోజ్‌కుమార్‌ (పాత చిత్రం)

దేవరపల్లి: యర్నగూడెం గండి చెరువు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం ధూమంతునిగూడేనికి చెందిన దండుబోయిన కొండయ్య, విజయ దంపతులు గొర్రెలు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు మనోజ్‌కుమార్‌(15) యర్నగూడెంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఈ నెల 18న పాఠశాలలో వీడ్కోలు వేడుక ఉండటంతో రెండు ద్విచక్రవాహనాలపై మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బయలుదేరాడు. గండి చెరువు వద్దకు వచ్చేసరికి రహదారిపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా వెనక్కి తిప్పడంతో వీరు తమ వాహనాలను అదుపుచేసే అవకాశం లేకపోవడంతో ఆటోను బలంగా ఢీకొని గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని హైవే అంబులెన్స్‌లో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి, మనోజ్‌కుమార్‌ని రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనోజ్‌కుమార్‌ సోమవారం మృతిచెందాడు. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని