మహిళల ఉపాధికి ఉన్నతి
గ్రామీణ మహిళలు ఇంటిపట్టున ఉంటూనే పలు రకాల ఆహార పదార్ధాల తయారీతో ఉపాధి ఏర్పర్చుకుంటారు.
సంఘ సభ్యులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లు
ఆలమూరు, న్యూస్టుడే: గ్రామీణ మహిళలు ఇంటిపట్టున ఉంటూనే పలు రకాల ఆహార పదార్ధాల తయారీతో ఉపాధి ఏర్పర్చుకుంటారు. కొందరు సొంత పెట్టుబడి, మరికొందరు అప్పుచేసి తయారీ చేపడుతుంటారు. చాలామందికి సకాలంలో సరైన పెట్టుబడి దొరక్క ఆయా రంగాల్లో వెనుకంజలో ఉంటుంటారు. ఇది గుర్తించిన కేంద్రప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా ఆహార, తదితర ఉత్పత్తుల తయారీలో మహిళలు ముందడుగు వేయాలనే సదుద్దేశంతో ‘‘ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజస్ స్కీమ్ ’’ (పీఎంఎఫ్ఎంఈ) అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో ఎక్కువ రుణం అందించేందుకు సంకల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించి, ఉత్పత్తుల తయారీకి స్థానికంగా అనుకూల పరిస్థితులను చూసి యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
సహాయక సంఘాలకు మాత్రమే..
పీఎంఎఫ్ఎంఈలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉంది. ఇందులో రెండు రకాల రుణాలు అందజేస్తున్నారు. సీడ్ క్యాపిటల్లో భాగంగా మహిళ స్వయం ఉపాధి కోసం రూ.40వేల రుణం అందిస్తారు. మిషనరీ సపోర్ట్ అవసరమై, మరికొందరికి ఉపాధి కల్పించే వారి కోసం హైయర్ ఆర్డర్గా రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు యూనిట్ అవసరం మేరకు రుణాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో 35శాతం రాయితీ, పది శాతం లబ్ధిదారులు వాటాగా చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఆహార తయారీ యూనిట్కు అవసరమయ్యే డీపీఆర్ను అందజేస్తే ముందుగా పరిశ్రమల శాఖ లాగిన్కి వెళుతుంది. దాన్ని జనరల్ మేనేజర్ పరిశీలించి, సంబంధిత బ్యాంకు మేనేజర్కు పంపుతారు. ధ్రువపత్రాలు పరిశీలించిన మీదట నగదు సంబంధిత మహిళ ఖాతాకు జమవుతుంది. యూనిట్ను నెలకొల్పేవారికి రెండు పొదుపు ఖాతాలు (ఎస్బీ) ఉండాలి. పాన్, ఆధార్కార్డు తదితర పత్రాలు సమర్పించాలి.
ఆహార ఉత్పత్తులకు అవకాశం
బేకరీ, త్రుణధాన్యాలు, పాలు, నూనె, చేప, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ, పసుపు, కారం, పిండి గిర్నీలు, పప్పులు తయారుచేసే యంత్రాల కొనుగోలు, స్థానికంగా పండించే పంటలను శుద్ధి చేసి తయారుచేసే ఉత్పత్తుల ఏర్పాటుకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్యాకేజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అవకాశాలు కల్పిస్తుంది.
వనితలు ముందుకు రావాలి
జిల్లాలో 2020-21లో 247 యూనిట్లు, 2021-22లో 30 యూనిట్లు మంజూరు చేశాం. ఇవన్నీ ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి. 2022-23కిగాను 340 యూనిట్లు గుర్తించాం. ఫుడ్ప్రాసెసింగ్ సొసైటీ నుంచి నిధులు అందగానే వారికి రుణాలు అందజేస్తారు. మహిళలు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను రూపొందించడానికి ముందుకురావాలి.
ఎం.ఎం.జిలానీ, అదనపు పీడీ, డీఆర్డీఏ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?