ఇదెక్కడి ప్రభుత్వం ప్రజల్లో తిరగలేకున్నాం..
ఇటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ప్రజలకు ముఖం చూపించలేకున్నాం. గ్రామంలో ఏ కార్యక్రమాన్నీ ముందుండి చేయలేకపోతున్నాం. వాలంటీరుకు ఉన్న గౌరవం కూడా మాకు లేదు.
సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను అభినందిస్తున్న వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు
న్యూస్టుడే, గాంధీనగర్, కాకినాడ నగరం: ఇటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ప్రజలకు ముఖం చూపించలేకున్నాం. గ్రామంలో ఏ కార్యక్రమాన్నీ ముందుండి చేయలేకపోతున్నాం. వాలంటీరుకు ఉన్న గౌరవం కూడా మాకు లేదు. సొంత నిధులు రూ.లక్షల్లో వెచ్చించినా రూపాయి కూడా వెనక్కు రాని పరిస్థితి. గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుందామని సర్పంచులుగా పోటీ చేశాం. గెలిచి రెండున్నరేళ్లు అవుతోంది. గ్రామాల్లో ఒక్క పని కూడా చేయలేకపోయాం. ఇదీ.. ఉమ్మడి జిల్లాలో పలువురు సర్పంచుల ఆవేదన.
కాకినాడ నగరంలో ఉమ్మడి జిల్లా సర్పంచుల సదస్సు మంగళవారం జరిగింది. సదస్సుకు అయినవిల్లి సర్పంచి కాకర శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, అతిథులుగా పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు తదితరులు హాజరయ్యారు. పార్టీలకతీతంగా తమ హక్కులు, నిధులు, విధుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో పలువురు సర్పంచులు మాట్లాడారు. ఎస్.మూలపాలెం సర్పంచి బొబ్బా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సచివాలయాల పేరుతో పంచాయతీలకు సమాంతర వ్యవస్థ నెలకొల్పి సర్పంచులకు గౌరవం లేకుండా చేశారన్నారు. జి.మేడపాడు సర్పంచి పటాని వెంకట్రావు మాట్లాడుతూ రెండున్నరేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనిచేయలేకపోయానన్నారు. ఉప సర్పంచిగా సంపాదించిన గౌరవం కూడా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా సర్పంచినని పట్టించుకోవట్లేదు...
- నాగాబత్తుల శాంతకుమారి, మాచవరం
అంబాజీపేట మండలంలో మాదో మేజర్ పంచాయతీ. తెదేపా తరఫున గెలవడంతో కార్యక్రమాలకు అధికారులు, అధికార పార్టీ నాయకులను పిలిచి సర్పంచిగా ఉన్న నన్ను పిలవడం లేదు. ప్రజల మధ్యకు వెళ్తుంటే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి . బ్లీచింగ్కు కూడా సొంత నిధులు ఖర్చు చేస్తున్నా. ఇప్పటి వరకు ఇలా రూ.17 లక్షల దాకా ఖర్చు చేశా.
దాక్కునే పరిస్థితి...
- మేడిద దుర్గాప్రసాద్, కొండుగుదురు సర్పంచి అయినవల్లి మండలం
జనసేన పార్టీ తరఫున ఎన్నికై రెండేళ్లు దాటినా మా ఊరి అభివృద్ధికి ఏమీచేయలేకపోయా. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఎటువంటి ఫంక్షన్లు జరిగినా వెళ్లలేక దాక్కునే పరిస్థితి. జగన్ వచ్చాక వాలంటీర్లు, గృహ కన్వీనర్లు, కన్వీనర్లు అంటూ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ, సచివాలయంలో ఈ పనిచేయమని చెప్పడానికి అవకాశం లేకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాల్ని చేశారు.
ముఖం చూపలేకపోతున్నాం
- కాకర శ్రీనివాసు, అయినవిల్లి సర్పంచి
అయిదు వేల ఓటర్లున్న పంచాయతీ మాది. ఎన్నికల్లో గెలిచి రెండున్నరేళ్లు కావస్తున్నా కనీసం పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపర్చి, బ్లీచింగ్ చల్లడానికి నిధులు లేవు. మా పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధమైన నిధులూ కేటాయించలేదు. వార్డు సభ్యులు, మేము ప్రజలకు ముఖం చూపించలేక తప్పుకొని తిరుగుతున్నాం.
ఇంత దారుణం ఎప్పుడూ చూడలే..
- సుభాషిణి, తుమ్మలపల్లి, అల్లవరం మండలం
రాజకీయాల్లో 22 ఏళ్లుగా ఉన్నా. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా జమచేస్తామంటూ ఓపెన్ చేసిన ఖాతాలో ఒక్క రూపాయి రాలేదు. సచివాలయంలో సర్పంచిని పట్టించుకోని దుస్థితి ఉంది.
వీధి దీపాలు వేయించలేకపోతున్నాం...
- వార జయసావిత్రి, తొత్తరమూడి సర్పంచి
వైకాపా తరఫున సర్పంచిగా ఎన్నికయ్యా. మాది మేజర్ పంచాయతీ. పెద్ద గ్రామంలో నిధుల కొరత కారణంగా పారిశుద్ధ్యం మెరుగుపర్చలేకున్నాం. వీధి దీపాలు కూడా వేయించలేకపోతున్నాం. చాలా వరకు సొంత నగదు ఖర్చుచేస్తూ పనులు చేస్తున్నాం. పూర్తి నిధులు వస్తే అభివృద్ధి చేసి మమ్మల్ని నమ్మి ఓటేసిన గ్రామ ప్రజలకు న్యాయం చేయగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!