కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
బొండాలు ధాన్యం కొనుగోలుపై స్పష్టత కరువు
న్యూస్టుడే, ముమ్మిడివరం
కోత దశకు వచ్చిన బొండాలు రకం వరి చేను
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో చాలా మంది ఎంటీయూ 1126 రకం సాగు చేయగా.. బొండాలు వేసిన రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురైంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులపై మళ్లీ అటువంటి ఒత్తిడే తెచ్చి.. కొనుగోలు విషయంలో తొలుత ఇబ్బందులకు గురి చేశారు. ముందుగా ఎంటీయూ 1126 వంటి సన్నాల రకం ధాన్యం కొనుగోలు చేసి.. చివరిగా బొండాలు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కేంద్రాల్లో బొండాలు రకం ధాన్యం కొనుగోలుపై ఆదిలోనే స్పష్టత ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.78 ఎకరాల్లో రైతులు రబీ సాగు చేపట్టారు. అమలాపురం డివిజన్లో ఐ.పోలవరం నుంచి రాజోలు వరకు రబీ సాగు ఆలస్యం కావడంతో కోతలకు ఇంకా కొంత సమయం పట్టినా.. రామచంద్రపురం డివిజన్లో ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో బొండాలు రకం సాగు చేపట్టారు. అంటే ఆ రకం ధాన్యమే సుమారు 3.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సన్నాలు రకం మరో 3.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సన్నాలు రకం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు ఇబ్బందులు లేకపోయినా.. బొండాలు విషయంలోనే కొంత అస్పష్టత నెలకొంటోంది.
ఎందుకిలా..
ఖరీఫ్, రబీల్లో ఆయా కేంద్రాల్లో సేకరించిన ధాన్యం సీఎంఆర్కు ఇస్తున్నారు. తద్వారా వచ్చే బియ్యాన్ని పీడీఎస్ కింద పేదలకు పంపిణీ చేస్తున్నారు. బొండాలు రకం సీఎంఆర్ కింద ఇచ్చినా.. వాటిని కేవలం బాయిల్డ్ రైస్ మిల్లులకే ఇవ్వాలి. తద్వారా ఉప్పుడు బియ్యం వస్తాయి. వీటిని పీడీఎస్ కింద పంపిణీ చేసే అవకాశం లేదు. కేరళ, ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ వీటిని వినియోగిస్తారు. వీటి ఎగుమతులకు అవకాశం కల్పిస్తే.. రైతులు పండించిన బొండాలు రకం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. గత ఏడాది రబీ సీజన్లో కేరళకు బొండాలు బియ్యం అందించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రుల సమక్షంలో ఒప్పందం కుదిరినా.. కోతలు వచ్చే సరికి ఎంత ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడం.. కేంద్రాల ద్వారా బొండాలు ధాన్యం కొనుగోలుపై సమాధానం లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. తర్వాత అనుమతులు రాగా వ్యాపారులు, రైస్ మిల్లర్లు ప్రయోజనం పొందడం మినహా రైతులకు ఒరిగిందేమీ లేదు.
60 శాతం పైగానే సాగు..
రబీలో బొండాలు 60 శాతం పైగానే సాగు చేశారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఎంటీయూ 3626 రకం దేశవాళీ వంగడం (పొట్టి బొండాలుగా పిలుస్తారు). దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతోపాటు ఎగుమతులకు తొలి ప్రాధాన్యమిస్తారు. రెండో రకం హైబ్రీడు బొండాలు (ఒంటి పుల్ల బొండాలు) వీటిని దేశవాళీ బొండాలతో సమానంగా రైతులు సాగు చేశారు. జిల్లాలో ఈ రకం బొండాలు ధాన్యం సుమారు. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వీటిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోతే.. ధర దళారుల పాలు కావాల్సిందే. జిల్లాలో 161 మిల్లులు ఉండగా.. 380 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.
మద్దతు ధరకు కేంద్రాల్లో అమ్ముకోవాలి
- ఎల్లారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు
ప్రస్తుత రబీలో రైతులు పండించిన బొండాలు (ఎంటీయూ 3626) ధాన్యం కొనుగోలు చేస్తాం. ఏప్రిల్ మొదటి, రెండు వారాల్లో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ఆర్బీకేల్లో కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తాం. బొండాలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దు. మద్ధతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM