2,400 ఇళ్ల రద్దు
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు.
పునాదులు వేయని 25వేల గృహాలకు బిల్లులు రానట్టే
కొమరగిరి లే-ఔట్లో నిర్మాణంలో ఉన్న గృహాలు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. లే-ఔట్లు సిద్ధం చేయకపోవడం, ఊరికి దూరంగా స్థలాలు ఇవ్వడం, ప్రభుత్వం ఇచ్చే యూనిట్ విలువ అతి తక్కువగా ఉండటం, కొండలు, గుంటల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీకు గృహ నిర్మాణ సామగ్రి తరలించే అవకాశం లేకపోవడం వంటి అనేక కారణాతో పేదలకు గృహాలు నిర్మించుకోలేకపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల భూసేకరణ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు కనీస పునాదికి శంకుస్థాపన చేయని ఇళ్లను రద్దు చేశారు.
మూడేళ్లు గడిచినా..?: సీఎం జగన్ 2020, డిసెంబరు 25న కొమగిరిలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. మూడేళ్లు దాటినా జిల్లాలో 2,400 ఇళ్లకు అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడేమో ఎన్నికల కోడ్తో ఈ ఇళ్లను రద్దు చేశారు. ఇళ్లు నిర్మించి ఇస్తామన్న జగన్ సర్కార్ తర్వాత మాట మార్చడంతో వీరందరికి సొంత గూడు సాకారం కాకుండా పోయింది. రద్దయిన ఇళ్లను ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంటుంది.
గోతులు తవ్వి వదిలేశారు..: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు మండలాల పరిధిలో 259 లే-ఔట్లలో 72,041 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 69,638 ఇళ్ల పనులు ప్రారంభించారు. వీటిలో కేవలం గోతులు తవ్వి, ఫిల్లర్లు వేసి, పునాదులు వేయనివి 25,206 ఉన్నాయి. వీటికి ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. పునాది దశకు చేరితేనే బిల్లులు జారీ మొదలవుతుంది. దీంతో పునాదులు వేయని 25,206 ఇళ్లకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు పనులు చేపట్టిన బిల్లులు వచ్చే అవకాశం లేదు. పునాది, అంతకన్నా ఎక్కువ ప్రగతిలో ఉన్న వాటికే వివిధ దశల్లో బిల్లులు మంజూరు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పునాదులకు చేరుకోని ఇళ్ల వివరాలను బిల్లులు చెల్లింపు పోర్టల్ నుంచి మినహాయించారు. ఆర్థిక స్థోమత సరిపోక చాలా మంది పేదలకు పునాదికి గోతులు తవ్వి, ఫిల్లర్లు వేసి వదిలేశారు. ఇలాంటి వారికి బ్యాంకు నుంచి వడ్డీలేని రుణం రూ.35వేలు ఇప్పిస్తామని చెప్పిన జగన్ సర్కార్ చాలా మందికి మొండి చేయి చూపింది. పేదలు ఉన్న ఇళ్లను తొలగించుకుని, పాకలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు.
మూడేళ్లలో 35శాతమైనా దాటలేదు..
జిల్లాలో 1.60 లక్షల మంది పేదలకు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్ల పట్టాలిచ్చారు. వీటిలో 72వేల మందికి మాత్రమే మూడేళ్లలో గృహాలు మంజూరు చేశారు. వీటిలో 35 శాతం ఇళ్లను ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. బుదవారం నాటికి జిల్లాలో 26,106 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే నూరు శాతం పూర్తి చేశారు. వీటిలో ఇంకా 10 శాతం ఫినిషింగ్ వర్కుల స్థాయిలో ఉన్నాయి.
- కాకినాడ నగర నియోజకవర్గంలో 21వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చినా.. ఇప్పటికీ ఒక కుటుంబం కూడా జగనన్న కాలనీ ఇంటిలో నివాసం ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ 16వేల ఇళ్లకు పైగా మంజూరు చేసినా, ఇప్పటికీ 1,900 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. జగన్నాథపురంలోని 7వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపినా ఆమోదం లభించ లేదు. వీరికి ఇక గృహాలు మంజూరు కానట్టే.
- సామర్లకోటలోని ఈటీసీ లే-ఔట్లో సీఎం జగన్ గృహ ప్రవేశాలను ప్రారంభించారు. ఈ లే-ఔట్లో 2,412 ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటికి వెయ్యి లోపు గృహా నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని లే-ఔట్లలో 50 శాతం గృహాలను సైతం పూర్తి చేయలేకపోయారు.
ప్రగతిలో ఉన్నవాటికే బిల్లులు
-ఎన్వీవీ సత్యనారాయణ, పీడీ, గృహనిర్మాణ సంస్థ, కాకినాడ
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలు మంజూరైన పనులు చేపట్టిని వాటిని రద్దు చేశారు. పునాదులు తవ్వి వదిలేసిన వాటికి ఇప్పట్లో బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. పునాది దశ దాటి, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు సంబంధించిన పనులు చేపడితే బిల్లులు విడుదల చేస్తారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే సామగ్రి అందజేస్తారు. ఆ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకోవచ్చు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బిల్లులు విడుదల చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్