తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి.
‘ఈనాడు-కేఎల్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఏవీఏ రోడ్డు, న్యూస్టుడే: ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. వీటిని నివృత్తి చేసేలా ‘ఈనాడు-కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో దశ-దిశ పేరిట గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కాతేరు తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. మారుతున్న టెక్నాలజీకీ అనుగుణంగా దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సిన కోర్సులను సూచించారు. ఇంజినీరింగ్ మొదటి ఏడాది తర్వాత బ్రాంచి మార్పు, కోర్సుల్లో కొంతకాలం విదేశీ వర్సిటీలో ఇంటర్న్షిప్ తదితర అవకాశాలను కేఎల్ యూనివర్సిటీలో ఎలా అమలు చేస్తున్నారో వర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు వివరించారు. ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ఛార్జి టీవీ చంద్రశేఖరప్రసాద్ మాట్లాడుతూ.. చదువు పేజీ, ప్రతిభ ద్వారా విద్యార్థుల భవితకు సరిపడా సమాచారాన్ని పత్రికలో ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయం కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు కె.శ్రావ్య, సత్యసాయి రమాదేవి, హెచ్వీ శ్రీనివాస్, దీపక్రెడ్డిలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సదస్సులో తమ అభిప్రాయాలను చక్కగా వెల్లడించిన విద్యార్థులు ఆదిత్య, ప్రణతిలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
కోర్సుల ఎంపిక ముఖ్యం
ఇంటర్ తర్వాత ఏయే కోర్సులను ఎంపిక చేసుకోవాలనే దానిపై విద్యార్థులు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యతోపాటు విషయ పరిజ్ఞానంపై విద్యార్థులు దృష్టి సారించాలి. కేవలం ఇంజినీరింగ్ పూర్తిచేస్తే ఉన్నత స్థాయికి చేరలేం. గతంలో బీటెక్ సర్టిఫికెట్ ఉంటే సాఫ్ట్వేర్పై శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేవారు. ప్రస్తుతం వాటికి కాలం చెల్లింది. ఎంపిక చేసుకున్న గ్రూప్లతోపాటు ఇతర రంగాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం వల్ల మాత్రమే ఉన్నత ఉద్యోగాలు పొందగలుగుతారు. అటువంటి కోర్సులు, విద్యా విధానం ఉన్న కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. కోర్సుల ఎంపికలో ముందుచూపు లేకపోతే ఆ ప్రభావం విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుపై పడుతుంది. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి.
జె.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ డైరెక్టర్, కేఎల్ యూనివర్సిటీ
పోటీతత్వం అవసరం
ఏ రంగమైనా పోటీతత్వం ఉంటేనే విజయం సాధించగలం. అందుకోసం విద్యార్థులకు అవగాహనతోపాటు శిక్షణ అవసరం. ప్రపంచంతో మన దేశం పోటీపడుతున్న తరుణంలో మనవంతుగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టిసారించాలి. అందుకోసం ఇటువంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలి.
బొబ్బిలి సత్యనారాయణ మూర్తి, కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మిషన్స్
సరైన విద్యా బోధన ఉండాలి
విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా బోధన జరగాలి. ఆ మేరకు విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కేటగిరి-1 వర్సిటీలో కేఎల్ యూనివర్సిటీ కూడా ముందు వరుసలో ఉంది. అవకాశాలు అందిపుచ్చుకొనే విద్యావిధానంతోపాటు ఆయా రంగాలపై అత్యుత్తమ శిక్షణ ఉంటుంది. దీంతో సులువుగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
హెచ్ఎస్ఆర్ మూర్తి,కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మిషన్స్
ప్రతి అడుగు కీలకం
ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకొన్నప్పుడే మంచి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇంటర్ తర్వాత విద్యార్థులు వేసే ప్రతీ అడుగు కీలకం. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని భారత దేశం శాసిస్తుంది. తద్వారా పలు ఉపాధి అవకాశాలు ఇక్కడే లభించే ఆస్కారం ఉంది. ఇంటర్ తర్వాత ఎంపిక చేసుకునే గ్రూప్లపై జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి భవిష్యత్తుకు ఇప్పుడు తీసుకునే ఆలోచనే పునాది కావాలి.
జి సతీష్బాబు, తిరుమల విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్
తల్లిదండ్రులూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ఇంజినీరింగ్ కోర్సులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. ఇంటర్ తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులు, వాటిలో రాణించే విధానంపైనే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ మేరకు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుగా అవగాహన చేసుకోవడం ద్వారా ఉన్నత స్థితికి మంచి ప్రణాళికలను సిద్ధం చేసినట్లవుతుంది.
వి.శ్రీహరి, తిరుమల కళాశాల ప్రిన్సిపల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
[ 26-04-2024]
రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!