అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు.
వైకాపా మూలనపడేసిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యండి
జగ్గంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, పక్కన కాకినాడ ఎంపీ, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ
ఈనాడు, కాకినాడ, న్యూస్టుడే, జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, గోకవరం, గండేపల్లి: కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. ఏం తమ్ముళ్లూ హుషారుగా ఉన్నారా..? ఆడబిడ్డలూ యుద్ధానికి సిద్ధమా..? అంటూ చైతన్యాన్ని ప్రోదిచేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో పాడైన ఎత్తిపోతల పథకాలను మళ్లీ ప్రారంభించే బాధ్యత తమదని అన్నారు. ఇక్కడకు అన్ని విద్యాలయాలు తీసుకొస్తామని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఒకటో తేదీన వాలంటీరుతో కాకుండా సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమర్థ పాలన ఉంటే విద్యుత్తు ఛార్జీలు పెరగవు.. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో మేనిఫెస్టో ఇస్తాం.
జగ్గంపేటలోని ప్రజాగళం బహిరంగ సభకు హాజరైన మహిళలు, అభిమానులు, శ్రేణులు... మాట్లాడుతున్న చంద్రబాబు
ఉత్సాహవంతుడు ఉదయ్.. యోధుడు నెహ్రూ..
4,500 టీ-టైం పాయింట్లు పెట్టి, 20 వేల మందికి ఉపాధి కల్పించిన కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నెహ్రూలను గెలిపించాలని చంద్రబాబు అన్నారు. ఉదయ్ శ్రీనివాస్కు గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి పార్లమెంటుకు పంపాలని.. ఆయన గెలిస్తే మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తారన్నారు. నెహ్రూ తన వెంటపడి చాగల్నాడు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు ఆగకుండా పుష్కర వచ్చిదంటే ఆయనే చొరవేనన్నారు. పురుషోత్తపట్నం ఆధునికీకరణ కోసం తపించారన్నారు. పవన్కల్యాణ్ అభిమానులు నెహ్రూ కోసం సైకిల్ గుర్తుపైనా.. తెదేపా అభిమానులు, శ్రేణులు ఎంపీ అభ్యర్థి ఉదయ్ కోసం గాజుగ్లాసు గుర్తుపై ఓటేయాలని కోరారు.
తెదేపా పాలనలో అభివృద్ధి.. వైకాపా పాలనలో విధ్వంసం చూశారు. ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యండి
మండుటెండలో.. ఉప్పొంగిన ఉత్సాహం..
రూ.4వేల పింఛనుపై ఫ్లకార్డుతో..
ప్రజాగళం బహిరంగ సభ మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుందంటే 2 గంటలకే జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో శ్రేణులు చేరాయి. ద్విచక్రవాహన ప్రదర్శనలతో, తెదేపా- జనసేన- భాజపా జెండాల రెపరెపలతో ఉత్సాహంగా తరలివచ్చారు. ఎండ తీవ్రతకు అసౌకర్యానికి గురవకుండా షామియానాలు, శీతల యంత్రాలు ఏర్పాటుచేశారు.
తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
జైకొట్టి.. నినదించి
చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్కు అధికారం సేవ చేయమని ఇచ్చారా? లేదా..? సేవా భావంతో పనిచేశాడా..? అని ప్రశ్నించగా చేయలేదంటూ ప్రజలు స్పందించారు. సజ్జల లాంటి బ్రోకర్, పనికిరాని వ్యక్తి..సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని విమర్శించడం న్యాయమా.. మీకు రోషం రాదా..?అని చంద్రబాబు విమర్శించినప్పుడూ ఆహుతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జగన్ జే బ్రాండ్ నాసిరకం మద్యం అమ్ముతున్నాడు.. మీ మగాళ్ల ఆరోగ్యం బాగుందా..? అని మహిళలను ప్రశ్నించినప్పుడు బాగాలేదంటూ చేతులు ఊపారు. సీపీఎస్ రద్దుచేశాడా..? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని తొమ్మిదిసార్లు పెంచాడా లేదా..? అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. * కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి.ఎస్.అప్పలరాజు, జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, భాజపా కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ పాల్గొన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛను ఏప్రిల్ నుంచే ఇంటిదగ్గరికే ఇస్తాం. ఒకనెల తీసుకోకపోతే, రెండోనెల, మూడో నెల ఇంటికే తెచ్చి ఇస్తాం. పింఛను పెట్టింది తెదేపా.. రూ.200 పింఛనును రూ.2వేలు చేసింది కూడా మేమే.
జెండాలతో ఉత్సాహం, ఆకట్టుకున్న బోర్డు, పసుపు కండువాలతో మహిళల జోష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు