నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే.
మండుటెండలో బ్యాంకులకు వెళ్లలేం
ఇంటికే పింఛను ఇవ్వాలంటున్న లబ్ధిదారులు
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బ్యాంకుల చుట్టూ తిప్పించేందుకు ప్రయత్నిస్త్తోంది. ఎన్నికల వేళ ఆలస్యం చేస్తూ, రకరకాల కుయుక్తులు పన్నుతోంది. సరిపడా సిబ్బంది ఉన్నా.. ప్రతిపక్షాలపై బురద జల్లుతూ ఓట్ల కోసం అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
‘‘ఒకటో తారీఖు వచ్చేసరికి.. పండగ దినమైనా సరే.. సెలవు దినమైనా సరే.. సూర్యోదయానికి ముందే చిక్కటి చిరునవ్వుతో ప్రతి అవ్వకు, తాతకు పింఛను అందిస్తున్నాం. అభాగ్యులకు, అవ్వా తాతలకు.. వితంతువులకు మంచిచేస్తూ.. సామాజిక పింఛన్లు రూ.3 వేలు చొప్పున ఇస్తున్నాం’
ఈ ఏడాది జనవరి 3న కాకినాడ సభలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలివి..
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, వి.ఎల్.పురం, కొవ్వూరు: ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన రెండ్రోజుల్లో దాదాపు 95 శాతానికి పైగా అందించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా యంత్రాంగం తలచుకుంటే అందుబాటులో ఉన్న సచివాలయ వ్యవస్థ సిబ్బంది ద్వారా రెండ్రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పంపిణీ పూర్తిచేయొచ్చు. అయినా కుంటి సాకులు చెబుతూ.. వృద్ధులను, అభాగ్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏప్రిల్ పింఛను కూడా ఉద్దేశపూర్వకంగా డబ్బు సర్దుబాటు చేయక, పంపిణీలో జాప్యంతో మండుటెండలో తీవ్ర నరకం చూడాల్సిన పరిస్థితి వైకాపా సర్కారు కల్పించింది.
ఏప్రిల్ మొదటి వారంలో సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ
వారికే సొమ్ముపడలేదు.. ఇప్పుడు వీరికట!
డీబీటీ(డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్) విధానంలో మే నెల పింఛన్లు విడుదల చేయనున్నారు. ఆ సొమ్ము లబ్ధిదారుల ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు జమకానుంది. ఇప్పటివరకు డీబీటీ విధానంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సొమ్ము అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛను సొమ్ముకు కూడా తమకు పాట్లు తప్పవా.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజులో ఇవ్వొచ్చు..
తూర్పులోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 512 సచివాలయాలుండగా వీటిలో 4,297 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి అదనంగా పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది వందల్లో ఉన్నారు. వీరందర్నీ పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం చేస్తే ఒక్క రోజులోనే ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయవచ్చు.
- సామాజిక భద్రత పింఛనుదారుల్లో అత్యధికంగా వృద్ధాప్య పింఛను పొందుతున్నవారు జిల్లాలో 1.21 లక్షల మంది ఉన్నారు. ఔషధాల కొనుగోలు కోసం ప్రతినెలా 1న అందే పింఛను డబ్బులపై ఆధారపడేవారు వీరిలో ఎక్కువ.
బ్యాంకులకు వెళ్లాలంటే ఇదీ ఇబ్బంది
- వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలా మందికి ఏటీఎం కార్డులు లేవు.. ఒకటో తేదీ మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం.. రెండో తేదీన వెళ్లాలి. పలుచోట్ల గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడంతో మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి.
- మరికొందరికి బ్యాంకు ఖాతాలు మనుగడలో లేవు.
- లబ్ధిదారులకు వేలిముద్రలు సరిగా పడటం లేదు. వీరు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాలన్నా అక్కడ ముద్రలు పడకపోతే ఇబ్బందే. నిర్వహణలేని ఖాతాల్లో నగదు ఉపసంహరణ సమయంలో బ్యాంకులు ఛార్జీల పేరిట మినహాయించుకునే అవకాశం ఉంది.
- జిల్లాలో అనేక గ్రామాల్లో బ్యాంకులు లేవు. కేవలం మండల కేంద్రాల్లో ఉన్నాయి.దీంతో పింఛనుదారులు తమ సొమ్ము కోసం మండల కేంద్రాలకు రావాల్సి ఉంటుంది.
74 శాతం మందికి అవస్థే
- తూర్పులో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 26 శాతం మందిని ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి వారికి మాత్రమే ఇళ్ల వద్ద ఇస్తామని, మిగతా 74 శాతం మందికి వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. నేరుగా బ్యాంకులకు వెళ్లి ఏటీఎం, బ్యాంకు కలెక్షన్ సెంటర్ల ద్వారాగాని నగదు ఉపసంహరించుకోవచ్చని చెబుతున్నారు.
- వితంతు పింఛను లబ్ధిదారులు 64,939 మంది, ఒంటరి మహిళ పింఛనుదారులు 9,140 మంది ఉన్నారు. మిగతావారిలో నేత, కల్లుగీత, కుండల తయారీదారులు, కళాకారులు, చర్మకార తదితరులు ఉన్నారు. వీరిలో చాలామందికి బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోగా పూర్తిగా అవగాహన లేనివారూ ఉన్నారు. వీరంతా పింఛను సొమ్ము ఉపసంహరణకు ఇబ్బంది పడే పరిస్థితి.
సచివాలయ ఉద్యోగులున్నారుగా..
గత నెలలో సచివాలయానికి రమ్మని ఇచ్చారు. ఇబ్బందిపడినా కొంత ఉపశమనం. ఈసారి బ్యాంకు ఖాతాకు వేయడంలోని మర్మమేమిటో నాకు బోధపడడం లేదు. నేను వాడపల్లి వెళ్లాలి. ఎవరో ఒకరి సాయంతో ఆటోపై వెళ్లాలి. తీరా వెళ్లాకా నగదు వస్తుందో రాదో ఏమైనా కొర్రీలు పెడతారో తెలియదు. ఆ బ్యాంకుకు చాలామంది పింఛను కోసం వస్తారు. సచివాలయ కార్యదర్శులతో మాకు సొమ్ము ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదో..!
పుసులూరి లక్ష్మి, మద్దూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు