logo

పాతకక్షల నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై దాడి

పాతకక్షల నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. పోలీసుల కథనం మేరకు.. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సామినేని రాఘవయ్య బుధవారం

Published : 27 Jan 2022 02:27 IST

యడ్లపాడు, న్యూస్‌టుడే: పాతకక్షల నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. పోలీసుల కథనం మేరకు.. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సామినేని రాఘవయ్య బుధవారం ఉదయం ట్రాక్టర్‌ నడుపుతూ కూలీలను పొలం తీసుకువెళుతున్నాడు. అదే సమయంలో వైకాపాకు చెందిన ఆలోకం వెంకటేష్‌, చాగంటి సందీప్‌, గంటా రామయ్య ద్విచక్ర వాహనాన్ని అడ్డుగా పెట్టి ట్రాక్టర్‌ను అటకాయించారు. మద్యంమత్తులో వారు పాత గొడవలకు సంబంధించి రాఘవయ్యతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. ఈ క్రమంలో రాఘవయ్య నడుము భాగంలో వెంకటేష్‌ చాకుతో పొడిచాడు. బాధితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని