ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయులకు పదోన్నతి కలే..!
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో 117 ఉపాధ్యాయుల్లో గుబులు రేకెత్తిస్తోంది. అసలు స్కూళ్లు, ఉపాధ్యాయుల పోస్టుల్లో ఎన్నింటికి కోత పడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద ఎల్ఎఫ్ఎల్ ఖాళీ పోస్టులకు కన్వర్షన్ పెడుతూ దస్త్రం పంపటంతో సంబంధిత ఉపాధ్యాయులు భవిష్యత్లో తమకు హెచ్ఎంలుగా పదోన్నతులు పొందే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. 1998కు ముందు టీటీసీ, డీఎడ్ అర్హతలతో సెకండరీగ్రేడ్
వంద పోస్టుల కన్వర్షన్
డీఎడ్ అర్హతలతో ఎస్జీటీలుగా పనిచేస్తున్న టీచర్లలో ఆందోళన
ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు
ఈనాడు-అమరావతి
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో 117 ఉపాధ్యాయుల్లో గుబులు రేకెత్తిస్తోంది. అసలు స్కూళ్లు, ఉపాధ్యాయుల పోస్టుల్లో ఎన్నింటికి కోత పడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద ఎల్ఎఫ్ఎల్ ఖాళీ పోస్టులకు కన్వర్షన్ పెడుతూ దస్త్రం పంపటంతో సంబంధిత ఉపాధ్యాయులు భవిష్యత్లో తమకు హెచ్ఎంలుగా పదోన్నతులు పొందే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. 1998కు ముందు టీటీసీ, డీఎడ్ అర్హతలతో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమితులైన వారు పదోన్నతిపై ప్రైమరీ పాఠశాలలకు హెచ్ఎంలుగా నియమితులయ్యేవారు. ఉద్యోగంలో చేరిన తర్వాత కొందరు అర్హతలు పెంచుకుని మరికొందరు సీనియారిటీపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేవారు. ఇలా ఏ అర్హతలు లేని వారు భవిష్యత్లో ఏర్పడే ఖాళీల్లో పదోన్నతులపై హెచ్ఎంలుగా నియమితులవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్లియర్ వెకెన్సీలుగా ఉన్న 100 పోస్టులను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వపరమైన జీవో లేకపోయినా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా కన్వర్షన్కు పెట్టి ప్రభుత్వానికి ప్రతిపాదించటాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. జిల్లాలో వీరందరూ కలిపి 139 మంది ఉన్నారు. వారిలో 39 మంది ఇప్పటికే అర్హతలు పెంచుకుని స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లిపోయారు. ప్రస్తుతం 100 మంది పనిచేస్తున్నారు. ఈ వంద మందితో పాటు ఇప్పటికే క్లియర్ వెకెన్సీలు మరో 100 ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్లో కనుమరుగవుతాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
డీఈఓ పూల్ కోటాలో 19 మంది
గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో 19 మంది హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో వీరు పనిచేస్తున్న స్కూళ్లల్లో వర్క్లోడ్ లేదని పనిభారం బాగా ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసి వారి సేవలను వినియోగించుకున్నారు. వారికి నెలవారీ జీతాలు మాత్రం వారు గతంలో ఎక్కడైతే పనిచేశారో ఆ స్కూల్ నుంచే చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతం వారందరిని గతంలో ఎక్కడి నుంచైతే వచ్చారో తిరిగి అక్కడకే పంపుతూ ఆదేశాలిచ్చారు. వారు ఆ పాఠశాలలో పనిలేకుండా ఉన్నారని గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తే తిరిగి వారిని వెనక్కు పంపటాన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు వారి అవసరం ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పుబడుతున్నారు. గతేడాది ‘పది’ పబ్లిక్ పరీక్షల్లో చాలా స్కూళ్లల్లో హిందీ తప్పారు. దీనికి కారణం ఆ సబ్జెక్టు బోధించటానికి రెగ్యులర్ ఉపాద్యాయులు లేకపోవటమే కారణమని ఒక అంచనాకు వచ్చారు. అలాంటప్పుడు డీఈఓ పూల్కోటాలో ఉన్న 19 మంది హిందీ ఉపాధ్యాయులను తిరిగి వర్క్లోడ్ లేని పాఠశాలలకు పంపటంపై సంఘాల నాయకులు, ప్రధానోపాద్యాయులు విద్యాశాఖ తీరుపై మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం