వానొస్తే చీకట్లు.. కాగితాల్లో ప్రణాళికలు
కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి.
లంక గ్రామాల ప్రజలకు తప్పని కష్టాలు
మంజూరు కాని రూ.10 కోట్ల నిధులు
ఈనాడు-బాపట్ల
కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి. నదికి 6 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే జిల్లా పరిధిలోని లంక గ్రామాలకు సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీంతో ఒకవైపు వర్షం.. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రాత్రి వేళ లంక గ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. వరదల సమయంలో పర్యటించే నేతలు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దీంతో వరదల సమయంలో ఏటా లంకల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట లంక గ్రామాల్లో 6లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సుమారు రూ.10 కోట్ల నిధులు అవసరమని అంచనాలు వేశారు. అప్పటి నుంచి పలు సాంకేతిక కారణాలతో ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. కృష్ణానది కరకట్ట లోపలివైపు విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పనులు చేయడానికి జనవరి నుంచి మే వరకు అనుకూల సమయం. ఈసారైనా పనులు చేపట్టాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
దిమ్మెల ఎత్తు పెంచేలా ప్రణాళిక
కృష్ణానది కరకట్ట లోపల ఉన్న విద్యుత్తు నియంత్రికలు(ట్రాన్స్ఫార్మర్లు) నదికి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ముంపునకు గురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో ఉన్న 430 నియంత్రికల దిమ్మెల ఎత్తు పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా నియంత్రికలు అమర్చిన 400 విద్యుత్తు స్తంభాలను కూడా 9.1 మీటర్లు ఉండేలా చూస్తారు. దీంతోపాటు 1000 జంక్షన్ స్తంభాలను కూడా మార్చనున్నారు. జువ్వలపాలెం, ఈపూరులంక గ్రామాల పరిధిలో ఉన్న మూడు విద్యుత్తు ఉపకేంద్రాల ఎత్తును పెంచుతారు. వరద సమయంలో ఇవి ముంపునకు గురికావడంతోపాటు సిబ్బంది యార్డులోకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపకేంద్రం ఎత్తు పెంచడంతోపాటు ఎంత వరద వచ్చినా యార్డులోకి వెళ్లే విధంగా ర్యాంపు కూడా ఏర్పాటు చేస్తారు. లంక గ్రామాల వెంబడి అవసరమైనచోట 12 మీటర్ల స్తంభాలు వేస్తారు. అదేవిధంగా దశాబ్దాల కింద వేసిన తీగలు కావడంతో మొత్తం మార్చి కొత్త లైన్లు వేయాలన్నా ప్రతిపాదనలు కూడా చేశారు. వీటన్నింటికి కలిపి రూ.10కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. రెండేళ్ల కిందట పంపిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు.
ఇబ్బందులు ఎన్నెన్నో..
కృష్ణానది కరకట్ట లోపల పదుల సంఖ్యలో లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత సారవంతమైన భూములు కావడంతో వాణిజ్యపంటలు పండుతున్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి వంటి పంటలు విస్తారంగా పండిస్తారు. ఇక్కడి వ్యవసాయం అంతా బోరుబావులపై ఆధారపడి ఉంటుంది. దీంతో లంక గ్రామాల్లోనే విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. స్థానికంగా వర్షాలు లేకపోయినా కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తారు. ఈ సమయంలో నాలుగైదు రోజుల పాటు సరఫరాకు అంతరాయం కలిగితే స్థానికంగా పంటలకు నీటితడులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. నదిలోచుట్టూ నీరున్నా పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవు. నదికి వరద సమయంలో గ్రామం చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండటంతో నదిలో ఉన్న పాములు, విషపురుగులు ఒడ్డుకు చేరే క్రమంలో గ్రామం పరిసరాల్లోకి చేరుకుంటాయి. రాత్రివేళ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వరద ఆగిన తర్వాత కూడా విద్యుత్తు పరికరాలు అన్నీ పరీక్షించి సరఫరాకు ఇబ్బంది లేదని గుర్తించిన తర్వాతే పునరుద్ధరిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పడుతోంది. వీటన్నింటికి పరిష్కారం చూపాలని కొన్నేళ్లుగా లంక వాసులు కోరుతూనే ఉన్నారు. వేసవి కాలంలో నదిలో నీరు తగ్గిపోతున్నందున విద్యుత్తు పరికరాల రవాణా, అమరికకు సౌకర్యంగా ఉంటుంది.
ప్రతిపాదనలు పంపాం
- మురళీకృష్ణయాదవ్, పర్యవేక్షక ఇంజినీరు, విద్యుత్తు శాఖ
కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కరకట్ట లోపల గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. గతంలో పంపిన ప్రతిపాదనలకు రూ.10 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. తాజాగా కొన్ని మార్పులు చేసి లైన్లు మార్చే అవసరం లేకుండా దిమ్మెలు ఎత్తు చేయడం, స్తంభాలు మార్చడం ద్వారా సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసేలా కసరత్తు చేసి పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!