ప్రమాదవశాత్తు 12 పూరిపాకలు దగ్ధం
మండల పరిధిలోని తోకలవారిపాలెం గ్రామంలో ఇటుక రాయి తయారీకి వచ్చిన వలస కూలీలు నివాసం ఉంటున్న 12 పూరి పాకలు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి.
పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడడమే కారణం
కొల్లూరు: అర్ధరాత్రి సమయంలో దగ్ధమవుతున్న పూరి పాకలు
కొల్లూరు, న్యూస్టుడే : మండల పరిధిలోని తోకలవారిపాలెం గ్రామంలో ఇటుక రాయి తయారీకి వచ్చిన వలస కూలీలు నివాసం ఉంటున్న 12 పూరి పాకలు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఇటుకరాయి తయారు చేయటానికి దూరప్రాంతాల నుంచి 40 మంది కూలీలు వలసవచ్చి పూరి పాకలు వేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇటుకరాయి వ్యాపారి చిన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. వీరి కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కూలీలంతా నిద్రిస్తుండగా, పాకలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పొలాల్లో కావడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాప్తి చెందలేదు. కూలీలు కట్టుబట్టలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కట్టెల పొయ్యిలో నిప్పు ఆర్పకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కూలీలకు ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటుచేసి దుస్తులు, ఆహారం అందించాలని వ్యాపారిని ఆదేశించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రేకులషెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శామ్యూల్ రాజీవ్కుమార్ తెలిపారు.
కొల్లూరు: ప్రమాదంలో గాయపడిన మహిళ
జంపనిలో ఒకటి..
వేమూరు: ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు దగ్ధమైన సంఘటన జంపనిలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎం.అబ్రహాం కుటుంబ సభ్యులు పొలం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. స్నానం కోసం నీళ్లను కట్టెల పొయ్యిపై ఉంచి, సమీపంలో కుమారుడి ఇంటికి వెళ్లారు. ఇంతలో మంటలు ఇంటికి అంటుకుని ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ఈ ఇంటికి విద్యుత్తు సదుపాయం కూడా లేదు. ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పక్కనే వేరొకరి పశువుల కొట్టానికి మంటలు అంటుకుని పాక్షికంగా దెబ్బతింది. తెనాలి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.50వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.
తిమ్మాయపాలెంలో పొగాకు బ్యారన్కు అగ్నిప్రమాదం
కాలిపోతున్న పొగాకు బ్యారన్ను నీళ్లతో ఆర్పుతున్న సిబ్బంది
తిమ్మాయపాలెం(అద్దంకి), న్యూస్టుడే: మండలంలోని తిమ్మాయపాలెంలో పొగాకు బ్యారన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతు ఉప్పుటూరి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఉదయం బ్యారన్లోని టైరు కర్ర పైనుంచి ఊడి కింద గొట్టాలపై పడటంతో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది క్వింటాళ్ల పొగాకుతో పాటు టైర్లు, కర్రలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు ఎంత ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపు కాలేదు. అద్దంకి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగినట్లు బాధిత రైతు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?