ఉల్లంఘనులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కంకర, గ్రానైట్, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా రవాణా, హద్దులు దాటి తవ్వకాలపై భూగర్భ గనులశాఖ నిఘా విభాగం పెద్దఎత్తున జరిమానాలు విధించింది.
ఏడాదిలో అక్రమార్కులకు రూ.146 కోట్ల జరిమానా
కంకర, గ్రానైట్, మట్టి అక్రమ రవాణాపై కొరడా
ఈనాడు, అమరావతి
అధిక బరువు ఉండడంతో చేబ్రోలు పోలీసులు సీజ్ చేసిన మట్టి టిప్పర్లు (పాతచిత్రం)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కంకర, గ్రానైట్, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా రవాణా, హద్దులు దాటి తవ్వకాలపై భూగర్భ గనులశాఖ నిఘా విభాగం పెద్దఎత్తున జరిమానాలు విధించింది. ఏడాది కాలంలో 839 కేసులు నమోదు చేసి రూ.146.34 కోట్ల మేర జరిమానా విధించారు. అధికార పార్టీ నేతలకు సహజ వనరులు కాసుల వర్షం కురిపించాయి. వీటిని కల్ప వృక్షంగా మార్చుకున్న నేతలు అక్రమార్జనే ధ్యేయంగా దందా చేశారు. జిల్లాలో మట్టికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేసి పెద్దఎత్తున సొమ్ము చేసుకున్నారు. నిఘా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినా అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రానైట్కు రూ.కోట్ల పన్నులు చెల్లించకుండా రోజువారీగా జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి. ఇందులో ఆయా పరిధిలో ప్రజాప్రతినిధులు సహకారం అందించడంతో అడ్డే లేకుండా అక్రమ రవాణా కొనసాగుతోంది. నిఘా విభాగం అధికారులు దాడులు చేసినప్పుడు రెండు నుంచి మూడు రోజులు తాత్కాలికంగా రవాణా ఆపి మళ్లీ యథేచ్ఛగా చేస్తున్నారు.
* పల్నాడు జిల్లాలో కీలకమైన ఎమ్మెల్యే ఒకరు గ్రానైట్ అక్రమ రవాణాలో సహకారం అందించి రోజువారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాలు కొత్తగా ఏర్పడడంతో ఆయా పట్టణాల చుట్టూ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుని వెంచర్లు వచ్చాయి. వీటిని చదును చేయడం, వెంచర్ల అభివృద్ధికి మట్టి పెద్దఎత్తున అవసరమైంది. నరసరావుపేట, నకరికల్లు, గురజాల, చేబ్రోలు, గుంటూరు గ్రామీణ, రొంపిచర్ల, నగరం, తాడికొండ, ఫిరంగిపురం తదితర మండలాల నుంచి గ్రావెల్ సరఫరా చేసి నేతలు జేబులో వేసుకుంటున్నారు. ఒంగోలు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి ఆయా మార్గాల్లో కంకర, గ్రావెల్, గ్రానైట్ తరలిస్తున్న వాహనాలను ఆకస్మిక తనిఖీల్లో భూగర్భ గనుల శాఖ నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 701 వాహనాలు పట్టుకుని రూ.3.26 కోట్లు జరిమానా వసూలు చేశారు. కంకర క్వారీల్లో అనుమతికి మించి తవ్వకాలు చేయడంతో రూ.102 కోట్ల జరిమానా విధించారు. మెటల్ క్రషర్లు, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లలో 61 కేసులు నమోదు చేసి రూ.8.64 కోట్ల జరిమానా వేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేసిన వారిపై 32 కేసులు నమోదు చేసి రూ.22.47 కోట్లు జరిమానా విధించారు. ఇలా అనుమతి లేకుండా, పరిమితికి మించి, నిబంధనల ఉల్లంఘన, అక్రమ రవాణా తదితర అంశాలపై మొత్తం రూ.146.34 కోట్లు భూగర్భ గనుల శాఖ విభాగం జరిమానా విధించింది.
అనుమతులు కొంత... అక్రమాలు కొండంత
ఉమ్మడి గుంటూరు జిల్లా విభజనతో కొన్ని ఖనిజాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోయి అడ్డగోలుగా తవ్వకాలు చేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. మట్టి తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు తీసుకుని కొండలను పిండిచేశారు. కోటప్పకొండలో అనుమతులకు మించి అవసరాలే ప్రాతిపదికగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడంతో కొండలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికంగా వందల ట్రక్కులకు అనుమతులు తీసుకుని వేల ట్రక్కుల మట్టి మాయం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల అందడండలు అందించడంతో స్థానిక యంత్రాంగం కూడా అడ్డుకునే పరిస్థితి లేకపోయింది. డిమాండ్ను అనుసరించి రాత్రిపగలు తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించారు. ఈ క్రమంలో నిఘా విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేసి వాహనాలు స్వాధీనం చేసుకుని జరిమానా వసూలు చేశారు. నేతల నుంచి ఒత్తిడి ఉన్నా నిఘా విభాగం ముందడుగు వేయడంతో జరిమానాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. నిఘా విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా మట్టి కాసుల వర్షం కురిపిస్తుండడంతో అక్రమార్కులు వృత్తిగా మార్చుకుని కొనసాగించారు. నకరికల్లు మండలం త్రిపురాపురంలో అయితే కొండ చుట్టూ తవ్వకాలు చేశారు. నాగార్జునసాగర్ కాలువ కట్టను సైతం అక్రమార్కులు వదిలిపెట్టకుండా తవ్వి తరలించారు. దాచేపల్లి భూగర్భ గనులశాఖ పరిధిలో ప్రభుత్వ భూముల్లో మట్టి కనిపిస్తే చాలు తవ్వేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. గురజాల మండలంలో దైద గ్రామంలో అక్రమ తవ్వకాలకు భారీ చెరువుల్లా గోతులు నిదర్శనంగా నిలిచాయి. నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల, గురజాలలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగినా అక్కడి యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించింది. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, గుంటూరు గ్రామీణ మండలంలో మట్టి అక్రమతవ్వకాలు జరిగాయి. బాపట్ల జిల్లాలో నగరం, పీవీపాలెం మండలాల్లో మురుగుకాల్వ కట్టలను సైతం వదలకుండా తవ్వేశారు. బాపట్ల జిల్లాలో బుసక పేరుతో పెద్దఎత్తున తవ్వకాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?