మొక్కల నిధులూ మెక్కారు!
మాచవరం మండలంలోని పిల్లుట్ల కేజీబీవీలో 100 మొక్కలు నాటితే 10 మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఇదే మండలంలోని మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులో 800 మొక్కల్ని నాటితే 150 మొక్కలే ఉన్నాయి.
నాటిన వాటిల్లో సగం కూడా బతకలేదు
రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
న్యూస్టుడే, సత్తెనపల్లి, పిడుగురాళ్ల
ముప్పాళ్ల నుంచి తురకపాలెం వెళ్లే రోడ్డులో నాటిన మొక్క ఇలా..
మాచవరం మండలంలోని పిల్లుట్ల కేజీబీవీలో 100 మొక్కలు నాటితే 10 మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఇదే మండలంలోని మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులో 800 మొక్కల్ని నాటితే 150 మొక్కలే ఉన్నాయి.
క్రోసూరు నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో విప్పర్ల వద్ద రోడ్డు పక్కనే 310 మొక్కలు నాటారు. దీనికి రూ.52 వేలు ఖర్చయింది. వీటిలో సగం మొక్కలు లేవు. ఇదే మండలంలో 9,890 మొక్కలు నాటగా దీనికి రూ.8 లక్షలు ఖర్చు చేశారు. వీటిలో 30 శాతం మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.
ముప్పాళ్ల నుంచి తురకపాలెం వెళ్లే రోడ్డులో 200 మొక్కలు నాటితే 50 కూడా బతికి లేవు. ఇక్కడ రూ.26 వేల వరకు నిధులు ఖర్చు చేశారు. ఇదే మండలంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు పంచాయతీకి రూ.25 వేలు నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారు. చాలాచోట్ల 30 నుంచి 40 శాతం మొక్కలే బతికాయి.
గ్రామాల సుస్థిర అభివృద్ధిలో భాగంగా మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న మొక్కల పెంపకం దారి తప్పుతోంది. పర్యవేక్షణ.. సమన్వయ లోపంతో నాటిన కొన్ని రోజులకే మొక్కలు ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాటినప్పుడు ఉన్న హడావిడి సంరక్షణపై చాలాచోట్ల ఉండట్లేదని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.
వరుసగా రెండేళ్ల నిధులు నేలపాలు..
2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పెద్దఎత్తున ఉపాధి నిధులతో మొక్కల పెంపకం చేపట్టారు. జగనన్న తోరణంలో భాగంగా 709 పనుల రూపంలో 777 కిలోమీటర్ల మేరకు 3,10,939 మొక్కలు నాటారు. దీనికి రూ.2.93 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో సగానికి పైబడి మొక్కలు బతకలేదు. జిల్లాలోని 28 మండలాలకు సగం మండలాల్లో పర్యావరణ పరిరక్షణ సరిగ్గా జరగలేదు. సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 63 పనుల రూపంలో మరో 16,846 మొక్కలు నాటారు. వీటిలో 11,700 మొక్కలు బతికి ఉన్నట్లు డ్వామా వెబ్సైట్లో పొందుపర్చారు. క్షేత్రస్థాయికి వెళ్తే ఇంతకంటే తక్కువగా మొక్కలు బతికి ఉన్నాయి. వీటికి చేసిన నిధుల ఖర్చులో సగానికి పైగా దుర్వినియోగమయ్యాయి. ఉద్యాన పంటల ప్రోత్సాహంలో భాగంగా రైతులకు అందజేసిన మొక్కలు సరైన యాజమాన్యంలేక పాడైపోయి రూ.లక్షల నష్టం వాటిల్లింది. ఒక్కో రైతుకు మూడేళ్లపాటు జామ, మామిడి, సపోటా తదితర మొక్కల నిర్వహణకు రూ.2 లక్షల వరకు నిధులిస్తారు. వీటిలో సగం మంది రైతులకు అందజేసిన సాయం నేలపాలైంది. మొక్కల పేరుతో మెక్కేయడంతోపాటు నిర్వహణ సరిగాలేక పాడైపోయిన మొక్కలకు పెట్టిన ఖర్చంతా కలిపితే రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృంద బాధ్యులు చెబుతున్నారు.
నిధులున్నా నిర్లక్ష్యమే..
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొక్కల పెంపకానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతకు ముందు ఏడాది నాటిన మొక్కల్ని పెంచితే అవి పెద్దవై వాతావరణంలో ఎంతో మార్పులు వచ్చేవి. మొక్కల సంరక్షణపరంగా నిధులున్నా నిర్లక్ష్యం చూపించడమే సమస్యగా మారింది. పంచాయతీలకు మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించారు. 200 మొక్కలుంటే వాటికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తే రూ.2 వేలు నుంచి రూ.2500 వరకు నగదు ఇచ్చారు. అయితే ఎప్పటికప్పుడు నిధులు రాకపోవడంతో రెండు, మూడు నెలలు నీరందించి పంచాయతీలు దాన్ని మరచిపోయాయి. పంచాయతీలు మొక్కల బాధ్యత చూస్తున్నాయని డ్వామా సిబ్బంది వాటిని పట్టించుకోకపోవడంతో అసలుకే మోసం జరిగింది.
మాచవరం కేజీబీవీలో ఎండిన మొక్క
50 శాతం కంటే తక్కువ ఉంటే నాటిస్తున్నాం
2021-22లో ఆర్థిక సంవత్సరంలో నాటిన మొక్కల్లో 50శాతం కంటే తక్కువగా బతికి ఉంటే మిగిలిన మొక్కల్ని క్రమశిక్షణ చర్యల కింద బాధ్యులతో ప్రస్తుతం నాటిస్తున్నాం. 15 రోజుల్లోపు మొక్కల్ని వారు నాటి సంరక్షణ చర్యలు చేపడతారు. 60 నుంచి 80 శాతం మొక్కలు కనిపించకుండా ఉంటే బాధ్యుల నుంచి నగదు రికవరీ చేస్తున్నాం. మొక్కల పెంపకంలో పంచాయతీలు, డ్వామా క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించాం.
జోసఫ్కుమార్, పీడీ, డ్వామా, పల్నాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం