Ysrcp: మీకో దండం.. మీతో రాలేం.. వైకాపా నేతలకు చెబుతున్న వాలంటీర్లు
‘‘మీకో దండం.. మమ్మల్ని వదిలేయండి.. ప్రశాంతంగా బతకనివ్వండి.. మాకు ఉద్యోగాలిచ్చింది ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడానికి మాత్రమే.
ప్రచారాలకు రామంటూ తిరస్కరణలు
నరసరావుపేటలో వాలంటీర్ల గ్రూపులో ఓ వైకాపా నేత సందేశం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘‘మీకో దండం.. మమ్మల్ని వదిలేయండి.. ప్రశాంతంగా బతకనివ్వండి.. మాకు ఉద్యోగాలిచ్చింది ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడానికి మాత్రమే. మీ పార్టీ ప్రచారానికి కాదు.. మేం ప్రచారానికి రాం’’ అంటూ వాలంటీర్లు వైకాపా నాయకులకు నిర్మోహటంగా చెప్పి పంపేస్తున్న ఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. నాయకుల స్వార్థం కోసం తామెందుకు బలికావాలి? అంటూ తటస్థంగా ఉంటూ కొందరు ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.
బలికావొద్దంటున్న తల్లిదండ్రులు..
కష్టపడి బీటెక్, డిగ్రీలు చదివిస్తే వాలంటీరుగా చేరారు.. నెలంతా గొడ్డు చాకిరీ చేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా వైకాపా అభ్యర్థుల ప్రచారంలో వాడుకుంటున్నారు. కోడ్ వచ్చినా వెంట తిరగాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రచారానికి వెళ్తే కేసులు నమోదవుతాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కేసులు నమోదైతే వీళ్ల జీవితమే నాశనమైపోతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కూడా రావు. ఏమైనా సరే.. ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టొద్దని వాలంటీర్ల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కొలువు వదిలేయండని, అంతేకాని వైకాపా ప్రచార పిచ్చికి బలికావొద్దని వాలంటీర్లుగా చేరిన పలువురి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రధానంగా మహిళా వాలంటీర్లను బయటకు పంపేదుకు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.
కారంపూడి, అమరావతి, బెల్లంకొండ, గురజాల, దాచేపల్లి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగించారు. దీంతో మిగతా వాలంటీర్లలో భయం పట్టుకుంది. కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని, భవిష్యత్తు నాశనమైపోతుందని యువ వాలంటీర్లలో అంతర్మథనం మొదలైంది. దీంతో వైకాపా ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసి రావాలంటూ ఎమ్మెల్యేలు, వైకాపా నాయకుల పిలుపులకు స్పందన కరవైంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఓ పదిమంది మినహా ఎవరూ రాజీనామాలు చేయలేదు. వాలంటీర్లను పావులుగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం జగన్ మొదలు వైకాపా అభ్యర్థుల వరకూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నియోజకవర్గాల్లో ఏ సమావేశం జరిగినా విందు, వినోదాలు నిర్వహించినా కొన్ని నెలలుగా వాలంటీర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మనమంతా ఒకటే.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే అది మీపైనే ఆధారపడి ఉంది. ఇంటింటికీ వెళ్లి జగనన్న రాకపోతే పింఛన్లు ఆగిపోయతాని ప్రచారం చేయండి. ప్రతిపక్ష అభ్యర్థులపైనా విష ప్రచారం చేయండని వాలంటీర్లకు సమావేశాలు పెట్టి మరీ వైకాపా అభ్యర్థులు కొన్నాళ్లుగా నూరిపోస్తున్నారు. దీని ప్రభావంతో వాలంటీర్లు కూడా ఇంటింటికీ వెళ్లి ఇదే చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడ్ అమలుతో వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న, వైకాపా అభ్యర్థులతో కలిసి తిరిగే వారిపై వేటు పడడంతో మిగతా వాలంటీర్లు వెనకడుగు వేస్తున్నారు.
రాజీనామా చేయకపోతే సస్పెండ్ చేస్తారంటూ తప్పుడు ప్రచారం..
నరసరావుపేటకు చెందిన ఓ వైకాపా నాయకుడు ఐదో వార్డు వాలంటీర్ల గ్రూపులో తప్పుడు ప్రచారాలు పోస్టు చేస్తున్నాడు. ‘ఐదో వార్డు సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లకు విజ్ఞప్తి. మనకు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లందరూ ఈరోజు నుంచి తమ రాజీనామా లేఖలను సచివాలయంలో అడ్మిన్కు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే కలెక్టర్ ఏక్షణమైనా మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు’ అంటూ మొదటిసారి పోస్టు చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో మరో గంటలోపే మరోసారి అదే సందేశాన్ని పోస్టు చేశాడు. రాజకీయ సంబంధిత ప్రచారాల్లో పాల్గొంటేనే సస్పెండ్ చేస్తారు అంతేకానీ సాధారణంగా తటస్థంగా ఉంటే సస్పెండ్ చేయరు. కానీ ఈ వైకాపా నేత కావాలని వాలంటీర్లను తప్పుదోవ పట్టించేయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా తమ పార్టీ ప్రచారాలకు వాడుకోవాలనే ప్రయత్నాల్లో భాగమే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వాలంటీర్లు కొందరు అప్రమత్తమవుతున్నారు. వరుసగా వాలంటీర్ల సస్పెండ్ వార్తలు ప్రచురితమవుతుంటే తాము ఎందుకీ బురదలోకి దిగడం అని మిగతా వారు ఆలోచనలో పడ్డారు. వైకాపా కుయుక్తులకు బలికావడం ఎందుకని మిగతావారిలో జ్ఞానోదయం కలిగి ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపిరెడ్డి.. డబ్బు, రౌడీయిజంతో గెలవాలని చూస్తున్నారు: అమూల్య భావోద్వేగం
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. -
తెదేపాలో చేరిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే
[ 28-04-2024]
బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత చీరాల గోవర్ధన్రెడ్డి తెదేపాలో చేరారు. నెల్లూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 28-04-2024]
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!