icon icon icon
icon icon icon

varla ramaiah: జగన్‌, జవహర్‌రెడ్డికి వృద్ధుల ఉసురు తగులుతుంది: వర్ల రామయ్య

జగన్‌ను అదికారంలో ఉంచడమే సీఎస్‌ జవహర్‌రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్‌నేత వర్ల రామయ్య ఆరోపించారు.

Updated : 04 May 2024 16:24 IST

మంగళగిరి: జగన్‌ను అధికారంలో ఉంచడమే సీఎస్‌ జవహర్‌రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్‌నేత వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్‌ డబ్బులు బ్యాంకులో జమ చేయడం కాదు.. వృద్ధులకు చేరడం ముఖ్యమన్నారు. బ్యాంకుల నుంచి ఇంకా 50శాతం మంది లబ్ధిదారులకు పింఛను సొమ్ము అందలేదన్నారు.

పింఛన్లు అందక ఇబ్బంది పడిన వృద్ధుల ఉసురు జగన్‌, జవహర్‌రెడ్డికి తప్పకుండా తగులుతుందన్నారు. రాజకీయ లబ్ధికోసం జగన్‌ ఏదైనా చేయగలరన్నారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టిన ఘనత ఆయనదేనని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 4లక్షల మంది టీచర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే వారి సేవలు ఉపయోగించుకొని.. 64లక్షల మంది పింఛనుదారులకు రెండ్రోజుల్లో ఇంటింటికీ వెళ్లి అందించవచ్చని చెప్పారు. మే 13న రాష్ట్ర ప్రజలందరూ ఓటు ద్వారా రాక్షస పాలనకు ముగింపు పలకాలని వర్ల రామయ్య పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img