కలవకపోతే.. తిరస్కరణలే
జీహెచ్ఎంసీ అమలు చేస్తోన్న జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ విధానం వసూళ్లకు అడ్డాగా మారింది. అన్ని రకాల పత్రాలతో ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు.
‘మీసేవ’లో దరఖాస్తు చేసినా పత్రాలతో రావాల్సిందే
జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో చేతివాటం
ఈనాడు, హైదరాబాద్
జీహెచ్ఎంసీ అమలు చేస్తోన్న జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ విధానం వసూళ్లకు అడ్డాగా మారింది. అన్ని రకాల పత్రాలతో ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు. దరఖాస్తుదారుకు ఫోన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పత్రాలను నేరుగా తీసుకురావాలని ఆదేశమిస్తున్నారు. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ చివరకు లంచం తీసుకుని ధ్రువీకరణపత్రాలను అందజేస్తున్నారు. దాంతో ఆన్లైన్ దరఖాస్తు విధానానికి అర్థం లేకుండాపోయిందనే విమర్శలొస్తున్నాయి.
తీరు మార్చుకోని అధికారులు..
జిల్లాల్లో నివసించేవారు పేట్లబురుజు, కోఠి, గాంధీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో కాన్పులకు హైదరాబాద్ వస్తుంటారు. అదే సమయంలో చికిత్స కోసం నగరానికి వచ్చిన వ్యక్తులు, ప్రమాదాలకు గురై నగరంలో మరణిస్తుంటారు. ఆయా జనన, మరణాలను జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం ధ్రువీకరించేందుకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చింది. తద్వారా ఆదిలాబాద్కు చెందిన వ్యక్తయినా సరే అక్కడి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అక్కడే సర్టిఫికేట్ తీసుకోవచ్చు.
కొందరు అధికారులు డబ్బు కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పత్రాలు సరిగా లేవని, ఫిజికల్ కాపీలతో ఆఫీసుకొచ్చి కలవాలనే కారణాలను చెబుతున్నారు.
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాల ధ్రువీకరణలు సరిగా జరగట్లేదు. ఆయా కుటుంబాల అమాయకత్వం, తొందరపాటు, ఆస్పత్రి ఉద్యోగుల నిర్లక్ష్యమే అందుకు కారణం. ఆస్పత్రిలో చేర్చుకునే సందర్భంలో కుటుంబసభ్యులు పేరును సరిగా నమోదు చేయించుకోకపోవడం, అలాంటి సర్టిఫికెట్లను సవరించాలంటూ వచ్చే దరఖాస్తులకు కనీసం రూ.5వేలు ఇస్తేగానీ ఆమోదం పొందట్లేదు.
కాళ్లరిగేలా తిప్పుతూ..
దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుండటం, తిరిగి అర్జీ పెట్టుకున్న ప్రతిసారీ అఫిడవిట్కు రూ.500 ఖర్చు, ఒక రోజు వృథా అవడంతోపాటు ఇతరత్రా ఇబ్బందులను సామాన్యులు భరించలేకపోతున్నారు. దీంతో అధికారితో రూ.2వేల నుంచి రూ.5వేల బేరం మాట్లాడుకుని ధ్రువపత్రాన్ని తీసుకెళ్లడం ఉత్తమమని భావిస్తున్నారు. పాస్పోర్టు, విదేశీయానం విషయంలో, ఎన్ఆర్ఐలకు ఇచ్చే ధ్రువపత్రాలకైతే రూ.10వేల నుంచి రూ.50వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారు. ముడుపుల కోసం అధికారులు సృష్టిస్తోన్న సమస్యలను కట్టడి చేసి, ఆన్లైన్ సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా: రేవంత్రెడ్డి
[ 27-04-2024]
అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్