Ap News: పుష్పరాజ్లు ఎక్కడ?
ప్రపంచంలోనే అరుదైన ఎర్రబంగారం (ఎర్రచందనం) కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో లభ్యమవుతోంది. సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగానే ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా సాగుతున్నా... పోలీసు, అటవీశాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి చక్రం తిప్పుతున్న బడా స్మగ్లర్లు
జిల్లాలో తమిళ కూలీలతో ఎర్రచందనం నరికివేత
పోలీసులకు చిక్కుతున్న వారిలో ఎక్కువమంది కూలీలే
ఏటా విదేశాలకు తరలిపోతున్న విలువైన ఎర్ర బంగారం
ఈటీవీ, కడప ప్రపంచంలోనే అరుదైన ఎర్రబంగారం (ఎర్రచందనం) కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో లభ్యమవుతోంది. సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగానే ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా సాగుతున్నా... పోలీసు, అటవీశాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వెరసి అరుదైన ఎర్ర బంగారం విదేశాలకు తరలిపోతోంది. ఎర్రచందనం రవాణా ఇతివృత్తంగా తెరకెక్కించిన ఓ సినిమా ఇటీవల విడుదలైంది.
* ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయంగా మంచి డిమాండు ఉండటంతో బడా స్మగ్లర్లు వాటిని విదేశాలకు తరలించడానికి ఎంతటికైనా తెగపడుతున్నారు. జిల్లాలో ఎర్రచందనం చెట్లను నరికి వాటిని లారీల్లోకి తరలించాలంటే తమిళ కూలీలదే ముఖ్య భూమిక. ప్రధానంగా రైల్వేకోడూరు శేషాచల అడువుల్లోకి పోలీసుల కళ్లు గప్పి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, నందలూరు, రాజంపేట, సిద్దవటం అటవీ ప్రాంతాల్లోకి చెట్లను నరకడానికి వస్తున్నారు. వారం, పది రోజులపాటు అడవిలోనే ఉండి మేలు రకం చెట్లను నరికి దుంగలుగా మార్చి లారీల్లో తరలిస్తున్నారు.
* జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి అక్కడ నుంచి విదేశాలకు యథేచ్చగా ఎర్రచందనం తరలిపోతోంది. బెంగళూరు సమీపంలోని కటిగెనహళ్లి ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు ముంబయి మీదుగా విదేశాలకు చేరవేస్తున్నట్లు పోలీసు అధికారుల పరిశీలనలో తేలింది. చాలా సందర్భాల్లో పోలీసులు కటిగెనహళ్లి, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది స్మగ్లర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. ఇలా పట్టుబడినవారిలో 80 శాతం మంది తమిళ కూలీలే. చెన్నై, బెంగళూరు, ముంబయి, దుబాయి ప్రాంతాల్లో ఉంటున్న బడా స్మగ్లర్లు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం టన్ను ధర రూ.కోటి పలుకుతోంది. గతంలో ప్రభుత్వం ఈ-వేలం ద్వారా విక్రయించిన సందర్భాల్లోనూ అదే ధర పలకడం గమనార్హం.
* తమిళనాడు నుంచి కూలీలను జిల్లాలోని అటవీ ప్రాంతాలకు తరలించేది అంతా మేస్త్రీలే. వీరికి వారం నుంచి పది రోజులకు రూ.లక్షల్లో ముడుతుండడంతో కూలీలు కూడా ప్రాణాలకు తెగిస్తున్నారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో వారిపైకి రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు. పోలీసులకు కూలీలు చిక్కినా వారి కుటుంబాలకు డబ్బులు చేరుతుండడంతో చెట్లు నరకడానికి వెనకాడటం లేదు. పోలీసు, అటవీశాఖలు మరింత నిఘా ఉంచి బడా స్మగర్లను పట్టుకుంటేనే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.
22 మందిపై పీడీ యాక్టు నమోదు
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు చేస్తున్నాం. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేయడమే కాకుండా తనిఖీ కేంద్రాల్లో సోదాలు సాగిస్తున్నాం. ఈ ఏడాదిలోనే చాలామంది స్మగ్లర్లను పట్టుకున్నాం. 22 మందిపై పీడీ యాక్టు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తున్నాం. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో బడా స్మగ్లర్లపై నిఘా పెడుతున్నాం. - అన్బురాజన్, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు సాధిస్తా
[ 10-05-2024]
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం జగన్ పక్కన పెట్టేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. -
సరకులిస్తానని డప్పు... ఉడకలేదు కందిపప్పు!
[ 10-05-2024]
బక్కజీవుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించే ప్రజా పంపిణీ వ్యవస్థను సీఎం జగన్ నీరుగార్చారు. సరకుల్లో కోత పెట్టారు. మరోవైపు ధరల మోతతో బడుగులపై అదనపు భారం వేశారు. -
కూటమితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా
[ 10-05-2024]
అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్బాషా కోరారు. -
వైకాపా నేతలు... కబ్జాల మేతలు
[ 10-05-2024]
ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె పట్టణంలో వైకాపా పాలన అలజడి రేపింది... సీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న పట్టణం కావడంతో ఆంధ్రా ఊటీగా పేరొందింది.. చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. -
ఓటు వేసుకుంటాం... ఏజెంట్గా కూర్చుంటాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం. -
విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు
[ 10-05-2024]
ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. -
ఎమ్మెల్యే భూమిపూజ చేసి రెండేళ్లు... పూర్తికి ఇంకెన్నాళ్లు
[ 10-05-2024]
ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. -
కోడ్ ఉల్లంఘన.. ఊరూరా వైకాపా స్టిక్కర్లు
[ 10-05-2024]
పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఖాజీపేట మండలంలో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘనల పరంపర పెరుగుతూనే ఉంది. -
జగన్ సభ వెలవెల
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది. -
మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
[ 10-05-2024]
మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరు
[ 10-05-2024]
సీఎం జగన్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?