ప్రగతి ప్రసాద్ం లేనట్లేనా?
ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశమున్నా, ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. ప్రధాన ఆలయాలపై శీతకన్నే ఉంటోంది.
వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలపై కేంద్రం శీతకన్ను
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
న్యూస్టుడే, ధర్మపురి: ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశమున్నా, ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. ప్రధాన ఆలయాలపై శీతకన్నే ఉంటోంది. దేశంలోనే వారణాసి, గయ లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రసాద్ పథకం కింద పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారు. ఆంధ్ర ప్రాంతంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2015లోనే రూ.55 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. తెలంగాణలోని శ్రీ జోగులాంబ శక్తిపీఠ ఆలయానికి రూ.36.73 కోట్ల నిధులు విడుదల చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చారు. మొత్తం 92.04 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు, భక్తులకు వసతులు, క్రాఫ్ట్ విలేజ్ పనులు, రామాయణ థీమ్ పార్కు, పర్ణశాల, సీతావాగు, ఇతరత్రా పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు.
లక్ష్యం సమున్నతం..
తీర్థయాత్ర స్థలాలు, వారసత్వ సంపదకు సంబంధించిన స్థలాన్ని సమగ్ర అధ్యయనం చేసే అభివృద్ధి లక్ష్యంతో ప్రసాద్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ఈ పథకం కింద అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 2019లోనే తెలంగాణ పొలిట్బ్యూరో సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ప్రధానంగా వేములవాడకు ఏటా నికర ఆదాయం రూ.100 కోట్లు, కొండగట్టుకు రూ.50 కోట్లు, ధర్మపురికి రూ.6 కోట్ల వరకు వస్తోంది. భక్తుల కానుకలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు పుణ్య క్షేత్రాలను ప్రసాద్ పథకంలో చేరిస్తే భక్తులకు వసతిగదులు, ఇతరత్రా పనులు చేపట్టే వీలుంటుంది. భక్తులు ఈ మూడు క్షేత్రాల్లో కనీస వసతులు కరవై నానా ఇబ్బంది పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.