మరనేత... ఆధునికత
రాష్ట్రంలోని తొలి వస్త్రోత్పత్తి కేంద్రం ఆధునికతవైపు అడుగులేస్తోంది. ఇక్కడ నిర్వహణ భారంతో ఇప్పటికీ కొందరు మరమగ్గాలను విక్రయించి పరిశ్రమలను మూసివేశారు. మరికొందరు పరిశ్రమలను ఆధునికీకరిస్తూ తమ నైపుణ్యాలకు వన్నెలద్ది నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు.
పరిశ్రమల నవీకరణతో ఉపాధి కొత్త పుంతలు
పార్కులో ఏర్పాటు చేసిన నూతన మరమగ్గాలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలోని తొలి వస్త్రోత్పత్తి కేంద్రం ఆధునికతవైపు అడుగులేస్తోంది. ఇక్కడ నిర్వహణ భారంతో ఇప్పటికీ కొందరు మరమగ్గాలను విక్రయించి పరిశ్రమలను మూసివేశారు. మరికొందరు పరిశ్రమలను ఆధునికీకరిస్తూ తమ నైపుణ్యాలకు వన్నెలద్ది నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు.
తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని టెక్స్టైల్ పార్కులో ప్రస్తుతం 65 పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటన్నింటిలోనూ ర్యాపియర్ మరమగ్గాలున్నాయి. ఇవి నిమిషానికి 180 ఆర్పీఎంల వేగంతో వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేస్తాయి. తొలుత నాలుగు పరిశ్రమల్లో 48 మరమగ్గాలు ఎయిర్, వాటర్ జెట్ మరమగ్గాలను అమర్చుకున్నారు. వీటి వేగం 600 ఆర్పీఎం. నిమిషానికి 300 మీటర్ల వస్త్రం 110 ఇంచుల వెడల్పుతో ఉత్పత్తి అవుతుంది. పాత మరమగ్గాల స్థానంలో కొత్తవాటికి సాంకేతిక నైపుణ్యాన్ని జత చేస్తే ఇక్కడి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం తెలుపు, రంగుల నూలుతో షూటింగ్, షర్టింగ్, బతుకమ్మ చీరలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి జకాట్ వంటి పరికరాలు అమర్చితే కంచి పట్టు చీరలు మొదలు డిజైనర్వేర్ వరకు.. చేతిరుమాల్ల నుంచి దుప్పట్ల వరకు అంతర్జాతీయ వస్త్రోత్పత్తులతో పోటీ పడే అవకాశం ఉంది. మరమగ్గాల నవీకరణతో కార్మికులపై పని భారం తగ్గుతోంది. ఉత్పత్తిలో వేగం పెరుగుతుంది. రోజు వారీ కూలి లాభదాయకంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
110 ఇంచుల వెడల్పుతో ఉత్పత్తి చేసే భారీ మరమగ్గం
25 శాతం రీయింబర్సుమెంటు
పరిశ్రమల స్థితిగతులు.. వస్త్రోత్పత్తులపై చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గతేడాది ఒక కమిటీ అధ్యయనం చేసింది. టెక్స్టైల్ పార్కు ప్రారంభించిన నాటి నుంచి ఇందులోని రాపియర్, జెట్ మరమగ్గాలను నవీకరించలేదు. ఇక్కడి పురాతన మరమగ్గాలతో నూతన ఆవిష్కరణలు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తమ నివేదికలో వెల్లడించారు. ఇప్పుడున్న మరమగ్గాల్లో మార్పులు తీసుకురావాలని భావించారు. దీని కోసం టి-ట్యాప్ (తెలంగాణ టెక్స్టైల్ అపారెల్ పాలసీ)ని తీసుకొచ్చారు. ఆధునికీకరించిన పరిశ్రమలకు యజమానులు వెచ్చించే నిధుల్లో 25 శాతం రీయింబర్స్మెంటు పొందవచ్చు. పార్కులో ఇప్పటికీ 20 మంది పరిశ్రమ యజమానులు ముందుకొచ్చారు. దీనిలో 200 మరమగ్గాల ఆధునికీకరణకు అవకాశం ఉంది.
సీఎఫ్సీ ఏర్పాటు చేస్తే...
తరచూ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న టెక్స్టైల్ పార్కులో ఆధునికతను అందిపుచ్చుకోవడం మంచి పరిణామం. దీనితోపాటు ఉమ్మడి వసతుల కేంద్రం (సీఎఫ్సీ)ని ఏర్పాటు చేస్తే ఉత్పత్తి మొదలు మార్కెటింగ్ వరకు ఇక్కడి నుంచే జరిగే వీలుంది. పార్కులోని యజమానులు సమ్మెకు వెళ్లడంతో వారి సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే ఆధునికీకరణతో కొత్తరకం ఉత్పత్తులు ప్రారంభిస్తే పార్కులో నిరుద్యోగులు, విద్యావంతులైన యువత కొత్తగా పరిశ్రమలను స్థాపించి ఉపాధి అవకాశాలను విస్తరించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!