మాజీ సైనికుల భూముల్లో పాగా
ఓ సింగరేణి కార్మికునికి మాజీ సైనికుల ప్లాట్లలో ఒకటి విక్రయించేందుకు బ్రోకర్ అడ్వాన్స్ తీసుకున్నాడు. నాలుగు నెలలైనా రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పకుంటున్నాడు. మాజీ సైనికునికి సంబంధించిన భూమి వారి కుటుంబ సభ్యులు విక్రయిస్తారని
నకిలీ పత్రాలతో మోసాలు
రిజిస్ట్రేషన్లు చేయకుండానే డబ్బు వసూలు
న్యూస్టుడే, గోదావరిఖని
* ఓ సింగరేణి కార్మికునికి మాజీ సైనికుల ప్లాట్లలో ఒకటి విక్రయించేందుకు బ్రోకర్ అడ్వాన్స్ తీసుకున్నాడు. నాలుగు నెలలైనా రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పకుంటున్నాడు. మాజీ సైనికునికి సంబంధించిన భూమి వారి కుటుంబ సభ్యులు విక్రయిస్తారని నమ్మబలికి అడ్వాన్స్ కింద రూ.లక్షల్లో తీసుకున్నాడు. వారితో రిజిస్ట్రేషన్ చేయించలేదు. పోనీ డబ్బులు తిరిగి ఇవ్వమంటే వాయిదాలు పెడుతున్నాడు. మధ్యవర్తుల ద్వారా వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇచ్చిన డబ్బులు ఏవిధంగా తీసుకోవాలో తెలియక సింగరేణి కార్మికుడు ఆందోళనకు గురవుతున్నాడు.
మాజీ సైనికులకు కేటాయించిన భూముల్లో కొందరు బ్రోకర్లు పాగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సైనికులకు ఇళ్ల కోసం రామగుండం మండలం ఎఫ్సీఐ గౌతమినగర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మాజీ సైనికుల సొసైటీ పేరుతో కేటాయించిన స్థలంలో 284 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో చాలామంది సైనికేతరులే ఆక్రమించుకున్నారు. కొంత స్థలంలో ఓ ప్రార్థన మందిరం కబ్జా చేసినట్లు మాజీ సైనికులు జిల్లా పాలనాధికారికి చాలా క్రితం ఫిర్యాదు చేశారు. కొంతకాలం ఈ వివాదం నడిచింది. మాజీ సైనికులకు కేటాయించిన కొన్ని ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. మాజీ సైనికులు చాలా మంది స్థానికంగా లేకపోవడంతో కబ్జాదారులు అందులో పాగా వేశారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. కొంతకాలం సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో రెండు వర్గాలు కావడంతో గతంలో చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఒక వర్గం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ సభ్యులు దూరంగా ఉండటం.. ఉన్నవారు పెద్దగా పట్టించుకోకపోవడంతో మాజీ సైనికులకు కేటాయించిన ప్లాట్లలో సైనికేతరులే ఆక్రమించుకున్నారు. ఆ ప్లాట్లనే క్రయవిక్రయాల కింద ఇతరులకు అమ్ముతూ కొంతమంది బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేయకుండానే ప్లాట్లు కేటాయించారు. చాలాకాలం క్రితం కొనుగోలు చేసిన వారికి ఆయా ప్లాట్లకు సంబంధించిన మాజీ సైనికులు సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. వారికి మాత్రమే ప్రస్తుతం పూర్తిహక్కు పత్రాలున్నాయి. 284 ప్లాట్లలో సగం మందికి పైగా కేవలం అనధికారికంగానే అందులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
సైనికేతరుల దర్జా
మాజీ సైనికుల కోసం కేటాయించిన స్థలాల్లో సైనికేతరులే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది మాజీ సైనికుల వద్ద కొనుగోలు చేసి ఉండగా మరికొంత మంది ప్లాట్లను కబ్జా చేశారు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన మాజీ సైనికులకు సొసైటీ ద్వారా ప్రభుత్వం గౌతమినగర్లో స్థలం కేటాయించింది. అప్పట్లో సొసైటీలో ఉన్న సభ్యుల ప్రకారం 284 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన మాజీ సైనికులకు ఇందులో ప్లాట్లు కేటాయించారు. అయితే వారు ఇక్కడికి రాకపోవడం.. కొంత మందికి తమ ప్లాటు ఎక్కడ ఉందన్న విషయం కూడా తెలియకపోవడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని ఆసరగా తీసుకున్న కొంతమంది బ్రోకర్లు మాజీ సైనికుల ప్లాట్లను తమ ఆదీనంలోకి తీసుకుని వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మాజీ సైనికుల హౌజింగ్ సొసైటీ పేరుతో ఉన్న స్థలంలో సైనికేతరులు నివాసం ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆ ప్లాట్లకు సంబంధించిన మాజీ సైనికుల పత్రాలు లేక రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అయినా కొంతమంది బ్రోకర్లు ప్లాట్లు విక్రయిస్తామని నమ్మబలుకుతూ అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.
కబ్జా చేస్తే చర్యలు
- రమేశ్, రామగుండం తహసీల్దార్
మాజీ సైనికుల స్థలాలను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. బ్రోకర్ల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దు. కేవలం మాజీ సైనికుల కోసం కేటాయించిన స్థలం. వారి నివాసానికి మాత్రమే ప్లాట్లు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసినట్లు సొసైటీ సభ్యులు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. కొంతమంది తప్పుడు పత్రాలతో ఇంటి నెంబర్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి