చేప పిల్లల పెంపకం లక్ష్యం 1.45 కోట్లు
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతుంది. జిల్లాలో గత ఐదేళ్లలో 4.17 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడిచిపెట్టారు. వీటి ద్వారా 13,254 టన్నుల చేపల ఉత్పత్తి రాగా
ఐదేళ్లలో వదిలినవి 4.17 కోట్లు
జలాశయంలో విడిచిపెడుతున్న చేప పిల్లలు
న్యూస్టుడే, బోయినపల్లి: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతుంది. జిల్లాలో గత ఐదేళ్లలో 4.17 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడిచిపెట్టారు. వీటి ద్వారా 13,254 టన్నుల చేపల ఉత్పత్తి రాగా మత్స్యకారులకు, చేపల విక్రయాలపై ఆధారపడిన వ్యాపారులకు ఉపాధి బాగా లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.45 కోట్ల చేప పిల్లలను వదలడానికి అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో రాజరాజేశ్వర (మధ్యమానేరు), ఎగువ మానేరు, అన్నపూర్ణ జలాశయాలు ప్రధానంగా ఉన్నాయి. జిల్లాలో 96 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా సుమారు 6,500 మంది సభ్యులు ఉన్నారు. జలాశయాలు, చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఏటా చేప పిల్లలు విడుదల చేసి పెంచుతున్నారు. 2017-18లో 69 నీటి వనరుల్లో 21.81 లక్షల చేప పిల్లలను అధికారులు వదలగా 126 టన్నుల చేపల ఉత్పత్తి వచ్చింది. ఏటా లక్ష్యాన్ని పెట్టుకుని నీటి వనరుల్లో పెంచి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చర్యలు చేపడుతున్నారు. జలాశయాల్లో 80 ఎంఎం నుంచి 100 ఎంఎం, చెరువుల్లో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం బరువు ఉన్న చేప పిల్లలను వదులుతున్నారు. కట్ల, రాహు, మృగాల రకం నీటి వనరుల్లో వేస్తున్నారు. రాజరాజేశ్వర జలాశయం పరిధిలో పది నుంచి ఇరవై కిలోల బరువున్న చేపలు సైతం లభ్యమవుతున్నాయి. మత్స్యకారులతోపాటు చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. రాజరాజేశ్వర జలాశయంలో లభిస్తున్న చేపలను మత్స్యకారుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారులు అక్కడే విక్రయించడంతోపాటు కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, హైదరాబాద్కు తరలించి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
6 వేల టన్నుల ఉత్పత్తి వస్తుందని...
2021-22 ఆర్థిక సంవత్సరంలో 392 నీటి వనరుల్లో 1.22 కోట్ల చేప పిల్లలను అధికారులు వదిలారు. వీటి ద్వారా 6 వేల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల్లో చేపలు వదలడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వదిలిన 392 ట్యాంకులతోపాటు అదనంగా మరో 40 ట్యాంకుల్లో వదలడానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు 1.45 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామాల్లో ట్యాంకుల పరిశీలన పూర్తి చేశారు.
ఉపాధి లభిస్తుంది
-శ్రీనివాస్, చేపల దుకాణం నిర్వాహకుడు, కొదురుపాక
రాజరాజేశ్వర జలాశయంలో వదిలిన చేప పిల్లల వల్ల మత్స్యకారులతోపాటు వ్యాపారులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. నాలుగేళ్లుగా స్థానిక మత్స్యకారుల నుంచి చేపలు కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల దారిలో ప్రయాణించే వాహనదారులతోపాటు చుట్టు పక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి చేపలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పట్టణాల్లోని వ్యాపారులు టోకుగా కొనుగోలు చేస్తున్నారు.
ప్రణాళిక సిద్ధం చేశాం
- శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలోని నీటి వనరుల్లో 2022-23లో 1.45 కోట్ల చేప పిల్లలను వదలడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. 2021-22లో లక్ష్యం మేరకు 1.22 కోట్ల చేప పిల్లలను వదిలాం. లక్ష్యం మేరకు చేప పిల్లలను వదులుతాం. దీనివల్ల మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి