ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ
వానాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవించి అంటువ్యాధులు ప్రబలుతాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. గోదావరి, మానేరు, హుసెన్మియా పరివాహక గ్రామాల్లో డెంగీ, మలేరియా వ్యాధులు
ఎపిడమిక్ సెల్ ఏర్పాటు
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ప్రమోద్కుమార్
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
వానాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవించి అంటువ్యాధులు ప్రబలుతాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. గోదావరి, మానేరు, హుసెన్మియా పరివాహక గ్రామాల్లో డెంగీ, మలేరియా వ్యాధులు గతంలో ప్రబలిన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు ఏఎన్ఎంలు, ఆశాసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు, అన్ని విభాగాల వైద్య సిబ్బంది సాయంతో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నామని ‘ఈనాడు’ ముఖాముఖిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్కుమార్ పేర్కొన్నారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, సిబ్బంది, మందుల నిల్వలు, కరోనా నాలుగోదశ అప్రమత్తత చర్యలపై ఆయన వివరించారు.
ఈనాడు: అంటువ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు?
డీఎంహెచ్వో: వర్షాకాలంలో ఎక్కువగా కలుషిత నీటితో, కీటక జనితంగా సంభవించే డెంగీ, మలేరియా, మెదడువాపు, అతిసారం ప్రబలే అవకాశాలెక్కువ. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టడంతో దోమల వ్యాప్తి తక్కువగానే ఉంది. మిషన్భగీరథ నీటిని గ్రామాల్లో కుటుంబాల వారీగా సరఫరా చేస్తున్న క్రమంలో కలుషిత నీటి సమస్యలు ఉండవు. ప్రత్యేకంగా ఈ సీజన్లో పంచాయతీరాజ్ అధికారులతో కలిసి మురుగు కాల్వలు, నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి వాటిని పూడ్చివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి నీటిని కాచి చల్లార్చిన అనంతరం వడగట్టి తాగాలి. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్సీ, జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నాం.
ఈ : మందుల కొరతతో పాటు పాములు, విషకీటకాలు, శునకాల బెడద ఉంటుంది. వీటికి సంబంధించిన డోసులు అందుబాటులో ఉన్నాయా?
డీఎంహెచ్వో: ఎక్కడా మందుల కొరత, ఇంజెక్షన్లు, టీకాల కొరత లేదు. వచ్చే మూడు నెలలకు సరిపడేలా, 16 పీహెచ్సీల్లో ఒక్కో కేంద్రంలో 100 డోసుల చొప్పున యాంటీ స్నేక్ వినం(ఏఎన్వీ), యాంటీ రేబిస్ వినం(ఏఆర్వీ)టీకాలను అందుబాటులో ఉంచాం. డిమాండ్కు అనుగుణంగా అంచానాలు వేసి ప్రత్యేకంగా అందిస్తాం.
ఈ: వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నివారణకు సన్నద్ధత ఎలా ఉంది?
డీఎంహెచ్వో: జిల్లాలో 16 పీహెచ్సీలలో 34 మంది వైద్యసిబ్బంది, 12 పల్లె దవాఖానాలు, 6 యుపీహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా కార్యాలయంలో ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేశాం. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కమిటీ సమావేశం నిర్వహించాం. పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ప్రతి శుక్రవారం డ్రై డే, అంటువ్యాధులు ప్రబలిన ఇంటితో పాటు చుట్టుపక్కల సర్వే, రక్తనమునాలు, మెడికల్ కిట్లు ఇవ్వడం వంటివి చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయిలో ‘ఇండోర్ స్ప్రే’ చేపట్టి అంటువ్యాధులను నియంత్రించాలి. పంచాయతీలలో మలేరియా వైద్య సిబ్బందితో ఆయిల్బాల్స్, ఫాగింగ్ చేపడుతున్నాం. ఐదువేల మలేరియా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాం. ఏఎన్ఎంలకు ప్రతి నెల 30 శాంపిళ్లు లక్ష్యం విధించాం. వారు జ్వరం వచ్చిన, అనుమానిత బాధితులకు జ్వరపరీక్షలు, రక్తనమునాలు సేకరించి, నివారణ మందులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. జిల్లా వారీగా ఓ అధికారి, డివిజన్ల వారీగా అధికార, సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఏదేని సమస్యలుంటే ఎపిడమాలాజిస్ట్ నరేశ్-9885092257ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ: సమస్యాత్మక గ్రామాలు గుర్తించారా? డెంగీ నివారణకు చేపడుతున్న ప్రణాళిక?
డీఎంహెచ్వో: జిల్లాలో మలేరియా వ్యాప్తి లేదు. ముత్తారం, మల్లారం, కేశనపల్లి, అడవిశ్రీరాంపూర్, రాఘవాపూర్, బేగంపేట, మంథని, మల్లేపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. రాఘవాపూర్లో సైతం ఒడిశా, బీహార్ ఇటుకబట్టీల కార్మికులు డెంగీ సోకిన తర్వాత జిల్లాకు రావడంతో ఇక్కడివారిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. సమస్యాత్మక గ్రామాల్లో తరచూ శిబిరాలు నిర్వహిస్తున్నాం. నిరుడు జిల్లావ్యాప్తంగా 330 డెంగీ కేసులు నమోదు కాగా మరణాలు సంభవించలేదు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 30 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ మందులు, పరీక్షలు, చికిత్సలు పూర్తి చేశాం. పంచాయతీల వారీగా ‘అబోట్’ ద్రావణాన్ని ఐదులీటర్ల చొప్పున సిబ్బందికి పంపిణీ చేసి పిచికారీ చేసేందుకు మంజూరు చేశాం. ‘డెంగీ’ తీవ్రమైతే ‘ఎలిసా’ పరీక్ష కోసం కరీంనగర్ సర్కారు ఆస్పత్రికి నమూనాలు పంపించి ఫలితాలు వెల్లడిస్తున్నాం.
ఈ: కొవిడ్ నాలుగోదశ ప్రభావం, వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఎలా సాగుతోంది?
డీఎంహెచ్వో: కొవిడ్ నాలుగో దశలో ఇప్పటి వరకు నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటికే మొదటి డోసు 5,93,137 మందికి పంపిణీ చేయగా రెండోడోసు సైతం 5.93 లక్షల మందికి పంపిణీ చేశాం. 15-17 ఏళ్ల వారికి మొదటి డోసు 38,129 మందికి ఇస్తే, రెండో డోసు 37,166 మందికి అందించాం. 12-14 ఏళ్ల మధ్యవారికి మొదటి డోసు 23,548 మందికి ఇస్తే రెండో డోసు అంతే మందికి ఇచ్చాం. వ్యాక్సిన్ల కొరత ఎక్కడా లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు