అడవిని మింగేస్తున్న అనకొండలు
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి.
వందలాది ఎకరాల్లో పచ్చని చెట్ల నరికివేత
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నిత్యం ఇదే తంతు జరుగుతోంది. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెట్లు నరికివేస్తూ మైదానంలా మారిన భూమిలో ట్రాక్టర్లతో వ్యవసాయానికి అనువుగా చదును చేస్తున్నారు.
జిల్లాలోని వేములవాడ అటవీ డివిజన్లో చెట్ల నరికివేత నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ చేసిన దగ్గర నుంచి ఇది మరింత ఎక్కువైంది. గిరిజనులు, గిరిజనేతరులు ఇలా ఎవరికి వారు చెట్లను నరుక్కుంటూ పోతున్నారు. ఒకప్పుడు రహదారి పక్కన కొంతదూరం దట్టమైన చెట్లు కనిపించేవి. అడవి లోపల మైదానంలా ఉండే ప్రాంతంలో మాత్రమే చెట్లు నరికి పోడు చేసుకునేవారు. ప్రస్తుతం సాగుకు అనువుగా లేని బండరాళ్లు ఉన్న ప్రాంతాలను సైతం వదలడం లేదు. ఇక్కడి అటవీ ప్రాంతంలో కలపకు ఉపయోగపడే చెట్లు తక్కువగా ఉన్నాయి. గిరిజన గూడేల్లో ఎవరి ఇంటి ముందు చూసినా నరికిన చెట్ల కర్రలను కుప్పగా పేర్చిన దృశ్యాలు కనిపిస్తాయి.
- రుద్రంగి మండలం మానాల శివారు నిజామాబాద్ జిల్లా దేవక్కపేట, భీంనగర్లో ఇటీవల వందల ఎకరాల్లో చెట్లను నరికివేశారు. ఆయా గ్రామాల శివారులో ఇప్పటికే అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. వీటికి సమీపంలోని అడవిలోని చెట్లను నరుక్కుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఒక్కొక్కరు సగటున 10-15 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
- మానాల సమీపంలోని తొమ్మిది గిరిజన గూడేల్లోని వారికి గతేడాది 1,700 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. పోడు పట్టాల పంపిణీలో స్థానికులే కమిటీ సభ్యులుగా ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేయొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వారికి ఇచ్చిన పోడు పట్టాలకు సమీపంలో రెండింతలు అటవీ భూమిని చదును చేసుకుంటున్నారు.
- రుద్రంగి శివారులోని మల్లన్నస్వామి ఆలయ సమీపంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసి ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే సూరమ్మ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గైరిగుట్ట, అడ్డబోరు తండాలకు చెందిన వారు 40 ఎకరాలను చదును చేశారు.
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం, కలికోట శివారులోని చెరువు సమీపంలో 60 ఎకరాలపైన, కొత్తపేట, తుర్తి శివారులో 30 ఎకరాల్లో చెట్లను నరికివేశారు.
- చందుర్తి మండలం సనుగులలోని పెసల్లబండలో గిరిజనేతరులు సుమారు 50 ఎకరాల వరకు చెట్లను నరికివేసి సాగుకు అనువుగా ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే తిమ్మాపూర్, రామన్నపేట, నర్సింగాపూర్ శివారులో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి అటవీ భూముల్లోకి వెళ్లి చదును చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
అధికారులపైనే నిఘా
అటవీ బీట్ అధికారుల కదలికలపై స్థానికుల నిఘా నిరంతరాయంగా ఉంటుంది. వారు తనిఖీలకు వస్తున్న విషయాన్ని అడవిలో ఉంటున్న వారికి సమాచారం చేరవేస్తారు. అధికారులు లోపలికి వెళ్లేలోపు అక్కడ ఎవరూ ఉండరు. వీరికి ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఉంది. ఒకరిద్దరు అధికారులు తనిఖీలకు వెళ్తే తిరగబడతారు. ఇటీవల రుద్రంగి మండలం అడ్డబోరు తండాలో బీట్ అధికారి బాలకృష్ణపై రాళ్లతో దాడి చేశారు. కొత్తపేటలో మహిళా బీట్ అధికారిపైకి తల్వార్తో దాడి చేసేందుకు వచ్చినట్లు సమాచారం. అటవీ భూముల్లోకి చొరబడి అక్రమంగా సాగుచేస్తున్న వారి నుంచి కొందరు అధికారులు ఏటా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సాగు చేసుకునే విస్తీర్ణాన్ని బట్టి ముట్టజెబుతారని తెలుస్తోంది. అందుకే వారి పరిధి దాటి ఎంతమేరకు ఆక్రమణలకు పాల్పడినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
కేసులు నమోదు చేశాం
- గౌసొద్దీన్, అటవీ సెక్షన్ అధికారి
ఎన్నికల విధుల్లో ఉండగా చెట్లను నరికివేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతాలను పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేశాం. దీంతోపాటు అటవీ భూమిలో చదును చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నాం. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, చొరబాట్లను కట్టడి చేసేందుకు రాత్రి సమయంలో బేస్క్యాంపులను ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనం ద్వారా గస్తీ తిరుగుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలం శ్రేణుల్లో కదనోత్సహం
[ 09-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు. -
గజిబిజిగా ఓటరు జాబితా
[ 09-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది. -
ప్రచారానికి 3 రోజులు.. పోలింగ్కు 5 రోజులు
[ 09-05-2024]
లోక్సభ పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఓ వైపు ప్రచారం తుది దశకు చేరుతుండటంతో నాయకులు వేగాన్ని పెంచుతుండగా ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలై ఉంది.. -
భానుడి భగభగ.. కావొద్దు ఓటుకు సెగ
[ 09-05-2024]
ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. -
ప్రచార ఉపాధి
[ 09-05-2024]
జెండాలు వేరైనా జిందాబాద్ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు. -
డిజిటల్ మాధ్యమం.. విస్తృత ప్రచారం
[ 09-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జన బాహుళ్యంలో ఉండే మాధ్యమాల ద్వారా ఓటు ప్రాధాన్యతను వివరిస్తోంది. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధునిక వైద్య సేవలేవీ!
[ 09-05-2024]
ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముప్పై పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ కేంద్రానికి మోక్షం కలగడం లేదు. -
ఇందూరు అభివృద్ధికి అండగా ఉంటా
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. -
దేశానికి మోదీతోనే భద్రత
[ 09-05-2024]
భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. -
సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఆదరిస్తే యువతకు ఉపాధి చూపిస్తా
[ 09-05-2024]
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. -
సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
[ 09-05-2024]
అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. -
కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి
[ 09-05-2024]
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. -
పుణ్యక్షేత్రం అభివృద్ధికి హామీ ఏది?
[ 09-05-2024]
వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు
[ 09-05-2024]
వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. -
ఆలయానికి ఎందుకు నిధులివ్వలేదు?
[ 09-05-2024]
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
రూ.12.50 లక్షల నగదు పట్టివేత
[ 09-05-2024]
జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు