ఎన్నికల వేళ నగదు కష్టాలు
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.
కోడ్తో వివిధ అవసరాలకు సామాన్యుల ఇబ్బందులు
ఈనాడు, కరీంనగర్
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాలన్నా, అక్కడి నుంచి నగదు తీసుకురావాలన్నా బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు నెల రోజుల కిందట ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడపాదడపా పట్టుబడుతున్న మొత్తమంతా ఎన్నికలకు సంబంధం లేనిదని సంబంధిత అధికారులకు తెలిసినా నిబంధనల అమలులో భాగంగా పట్టుకోక తప్పడం లేదు. దీంతో వ్యాపార, ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్లే వారికి కష్టాలు తప్పడం లేదు.
అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందా!
చెక్పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నగదు పెద్దమొత్తంలో పట్టుకున్న దాఖలాలు లేవు. గతేడాది నవంబరులో పట్టుబడినవి కూడా చిరు వ్యాపారులు, సామాన్యులకు సంబంధించిన నగదు కావడం గమనార్హం. మరోవైపు పార్టీలు, అభ్యర్థుల కదలికలపై దృష్టి సారించాల్సిన పోలీసులు, ఎన్నికల యంత్రాంగం కేవలం రహదారులపై నామమాత్రపు చెక్పోస్టులతో చేతులు దులుపుకొంటున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న క్రమంలో కొంత నగదు దొరుకుతుంది. ఇలా ఏ మాత్రం చిన్న మొత్తం దొరికినా పట్టుబడిన నగదులోనే జమ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల అభ్యర్థులు మాత్రం రూ.లక్షల్లో నగదును పోలీసులు, నిఘా వ్యవస్థ కళ్లు గప్పి తరలిస్తున్నట్లు సమాచారం. ఓటర్లకు నగదు పంపిణీ సహా మద్యం తదితర ప్రలోభాలతో ఓట్లు పొందే ఏర్పాట్లలో నాయకులు బిజీగా ఉన్నారు.
- ఈ నెల 22న జమ్మికుంటలో వ్యాపారులకు సంబంధించిన రూ.15 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. పత్తి వ్యాపారి బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అవి రైతులకు చెల్లించాల్సిన మొత్తమని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో మరుసటి రోజు పత్తి వ్యాపారులంతా రోడ్డెక్కారు. రాజకీయాలతో సంబంధం లేని తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నాయకులకు చెందిన నగదు పట్టుబడటం లేదని, సామాన్యులు, వ్యాపారుల డబ్బులు మాత్రమే పట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- గతేడాది నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో కరీంనగర్లోని ఓ వస్త్ర దుకాణానికి చెందిన చెందిన నగదును సమీపంలోని బ్యాంకులో వేసేందుకు వెళ్తున్న దుకాణ సిబ్బందిని పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత పత్రాలు చూపించినా ఏదైనా ఉంటే ఎన్నికల అధికారులకు చెప్పాలంటూ డబ్బు సీజ్ చేశారు. దాదాపుగా రూ.3 కోట్ల వరకున్న ఈ మొత్తాన్ని కోడ్ ముగిసే వరకు వ్యాపారులు తిరిగి పొందలేకపోయారు. కేసు నమోదు, నగదు కోసం తిరగాల్సి రావడం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. అలాగే నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై రూ.2 లక్షలు తీసుకెళ్తున్న వారికి కూడా ఇలాంటి అవస్థలే ఎదురయ్యాయి.
దొరికిన డబ్బును ఏం చేస్తారంటే..
ఎన్నికల వేళ రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పట్టుబడిన నగదును జిల్లా ట్రెజరీలో జమ చేస్తారు. రూ.10 లక్షలకు మించి దొరికితే ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారికి తెలియజేస్తారు. పట్టుబడిన నగదును వారికి అప్పగిస్తారు. అక్కడి నుంచి నగదు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. సరైన ఆధారాలు చూపి తిరిగి పొందవచ్చు. తక్కువ మొత్తంలో పట్టుబడిన డబ్బును జిల్లా స్థాయి ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఆధారాలు పరిశీలించి తిరిగి అప్పగిస్తారు. జిల్లా స్థాయి కమిటీ సభ్యులు నిజంగానే అది వారిదేనని భావిస్తే పక్కా ఆధారాలు పరిశీలించి ఇచ్చేస్తారు.
నిర్లక్ష్యం వద్దు
- రోజువారీగా తీసుకెళ్లే మొత్తమే అయినా, సంబంధిత ఆధారాలను వెంట ఉంచుకోవాలి.
- ఏ అవసరం నిమిత్తం నగదును తీసుకెళ్తున్నామనే విషయం సూటిగా చెప్పడంతో పాటు తగిన పత్రాలను తప్పక చూపాలి.
- ఏ మాత్రం భయపడినా, సరైన సమాధానం చెప్పకున్నా పోలీసులకు అనుమానం వస్తుందని గుర్తుంచుకోండి.
- ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి బిల్లు చెల్లించడానికి డబ్బు తీసుకెళ్తుంటే రోగి, చికిత్సకు సంబంధించిన వివరాలు, ఆస్పత్రి బిల్లు, రసీదులు వెంట ఉంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.