logo

భానుడి భగభగ...

ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది.

Published : 27 Apr 2024 05:31 IST

ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45.1, కొల్వాయి 45.1, అల్లీపూర్‌లో 45.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేటలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 33.9 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో పగలు, రాత్రిపూటకూడా పూర్తిగా వేడివాతావరణం నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల అయిదు రోజుల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు సరాసరిగా 42-47 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతాయని జగిత్యాల పరిశోధనస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27-32 డిగ్రీల సెల్సియస్‌ వద్ద, గాలిలోతేమ 24-61 శాతం వరకు నెలకొంటుందన్నారు. అక్కడక్కడ తేలికపాటి వర్షసూచన ఉందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని