కబ్జాల పర్వం!
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం.
నలుగురి పేర మారిన పురపాలక స్థలం
న్యూస్టుడే, వేములవాడ
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి అందులో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే అది మున్సిపల్ లేఅవుట్ కింద కేటాయించిన 10 శాతం స్థలమనే విషయం తెలియడంతో కంగుతిన్నాడు.
వేములవాడ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇదే తరహాలో అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పలు సందర్భాల్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్రమణల పర్వం ఆగడం లేదు. వేములవాడ పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో కొన్నాళ్లుగా స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేములవాడ పట్టణం, విలీన గ్రామాల్లో దాదాపు 40 సర్వే నంబర్లలో లే అవుట్లు వేశారు. దీంతో ఆయా లేఅవుట్లలోని పది శాతం స్థలాన్ని ప్రజా అవసరాల కోసం పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసి స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. తరవాత వేరొకరికి విక్రయిస్తున్నారు. అధికారులు నామమాత్రంగా రక్షణ చర్యలు చేపట్టడం అక్రమార్కులకు వరంగా మారింది.
పర్యవేక్షణ లేక...
పురపాలక సంఘానికి రూ.కోట్ల విలువ చేసే స్థలాలున్నా అధికారుల పర్యవేక్షణ కరవైంది. దీంతో అక్రమార్కులు ఏ కొద్ది అవకాశం దొరికినా కబ్జా చేసేందుకు చూస్తున్నారు. నాంపల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 2006లో ఓ సర్వే నంబరులో లే అవుట్ కింద స్థలాన్ని కేటాయించారు. తరవాత మున్సిపల్లో విలీనం కావడంతో ఆ స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుంది. అయితే దానికి ఆక్రమించి ఇతరులకు విక్రయించేశారు. ఇలా నలుగురి చేతులు మారిన డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. స్థలాలు కోట్లాది రూపాయల విలువ చేసేవి కావడంతో అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పక్కన ఉన్న సర్వే నంబర్ల ద్వారా కబ్జాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది వీటి రక్షణకు దాదాపు రూ.10 లక్షల నిధులతో మున్సిపల్ అధికారులు వాటి చుట్టూ ఇనుప వైర్తో పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనులు సైతం తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. చాలా వాటికి పెన్సింగ్ ఏర్పాటు చేయకుండానే వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి లే అవుట్ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
- అన్వేష్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
మున్సిపల్ స్థలాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రూ. 10 లక్షలు వెచ్చించి స్థలాల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేశాం. కోర్టు వివాదంలో ఉన్న వాటికి ఏర్పాటు చేయలేదు. నాంపల్లిలో మున్సిపల్ స్థలం కొనుగోలు చేసిన వారు నిర్మాణ అనుమతికి కార్యాలయానికి వస్తే లేఅవుట్ స్థలం కింద మున్సిపల్కు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పాం. మున్సిపల్ లేఅవుట్ స్థలాలు ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?