మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
వేములవాడ, న్యూస్టుడే: లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ కూడలి వద్ద శుక్రవారం పోలీసులు నాకాబందీ నిర్వహించి చేపట్టిన వాహనాల తనిఖీలను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా సరిహద్దులు, పట్టణాలు, మండల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎవరైనా రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు వెంట పెట్టుకొని వెళ్లాలని సూచించారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపిస్తే గ్రీవెన్స్ కమిటీ రెండు రోజుల్లో నగదు రిలీజ్ చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ను ఆర్డీవో రాజేశ్వర్తో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్రూం వద్ద భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిని పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ వీర ప్రసాద్, ఎస్సైలు అంజయ్య, గోపాల్రెడ్డి, దిలీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు