అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది.
పీడీచట్టం అమలుకు కసరత్తు
న్యూస్టుడే, గోదావరిఖని
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. అక్రమ దందాలతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు నేరాల చిట్టా ఆధారంగా పీడీ చట్టం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ అంశంపై పోలీసు కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించారు. కమిషరేట్ పరిధిలో ఉన్న నేరస్థులు.. వారి ప్రవర్తన.. కదలికలపై నిఘా పెట్టారు. నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులు, గంజాయితో పాటు రేషన్ బియ్యం దందా.. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు వీటిలో ఎంతమంది పాత నేరస్థులున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు.
సిద్ధమవుతున్న జాబితా...
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో చాలా కాలంగా పీడీ చట్టం అమలు చేయలేదు. దీనిని ఆసరాగా తీసుకొని చాలా మంది నేరస్థులు వారి దందాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. భూదందాలు చేస్తూ అమాయకులను బెదిరింపులకు గురిచేస్తున్న కొంత మంది రౌడీషీటర్లపై పీడీ చట్టం అమలు చేసేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించేందుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తుగానే పీడీ చట్టం అమలు చేయడం ద్వారా ఓటింగ్కు ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 13.228 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 16 కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్టు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో 969.05 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 70 మందిపై కేసులు నమోదు చేశారు. సుమారు రూ.17,94,090 విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. నాటుసారా తయారు చేస్తున్న 105 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 513 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రూ.8,34,649 విలువ చేసే 1449 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 181 మందిపై కేసు నమోదు చేశారు. 87 మందిపై ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేయడంతో పాటు 50 ట్రాక్టర్లు, ఒక డీసీఎం వ్యాన్, మూడు జేసీబీలు స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ అక్రమ దందా నిర్వహించే ఏడుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు 5325 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల దందా, కోడిపందేలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేశారు. పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 184 మందిపై కేసులు నమోదు చేసి రూ. 22,15,260 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే వారిపై దృష్టి సారించారు.
దందాలకు పాల్పడితే కఠిన చర్యలు
-ఎం.శ్రీనివాస్, పోలీసు కమిషనర్, రామగుండం
అక్రమ దందాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేశాం. కమిషనరేట్ పరిధిలో ఎవరైనా అక్రమ దందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. నిత్యం అదే పనిగా దందాలు సాగిస్తే పీడీ చట్టం అమలు చేస్తాం. కమిషనరేట్ పరిధిలో కొంత మందిని గుర్తించాం. వారిపై త్వరలోనే పీడీ చట్టం అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తాం. పాత నేరస్థులు తమ విధానాలు మార్చుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజిబిజిగా ఓటరు జాబితా
[ 09-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది. -
ప్రచారానికి 3 రోజులు.. పోలింగ్కు 5 రోజులు
[ 09-05-2024]
లోక్సభ పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఓ వైపు ప్రచారం తుది దశకు చేరుతుండటంతో నాయకులు వేగాన్ని పెంచుతుండగా ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలై ఉంది.. -
భానుడి భగభగ.. కావొద్దు ఓటుకు సెగ
[ 09-05-2024]
ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. -
ప్రచార ఉపాధి
[ 09-05-2024]
జెండాలు వేరైనా జిందాబాద్ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు. -
డిజిటల్ మాధ్యమం.. విస్తృత ప్రచారం
[ 09-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జన బాహుళ్యంలో ఉండే మాధ్యమాల ద్వారా ఓటు ప్రాధాన్యతను వివరిస్తోంది. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధునిక వైద్య సేవలేవీ!
[ 09-05-2024]
ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముప్పై పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ కేంద్రానికి మోక్షం కలగడం లేదు. -
ఇందూరు అభివృద్ధికి అండగా ఉంటా
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. -
దేశానికి మోదీతోనే భద్రత
[ 09-05-2024]
భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. -
సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఆదరిస్తే యువతకు ఉపాధి చూపిస్తా
[ 09-05-2024]
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. -
సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
[ 09-05-2024]
అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. -
కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి
[ 09-05-2024]
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. -
పుణ్యక్షేత్రం అభివృద్ధికి హామీ ఏది?
[ 09-05-2024]
వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు
[ 09-05-2024]
వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. -
ఆలయానికి ఎందుకు నిధులివ్వలేదు?
[ 09-05-2024]
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
రూ.12.50 లక్షల నగదు పట్టివేత
[ 09-05-2024]
జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్