సామాజిక మాధ్యమ సహకారం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహం అందిస్తూ ఇద్దరు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుస్తకాల ప్రచురణతో పాటు ఎలాంటి అంశాలు చదవాలనే విషయమై ఒకరు అవగాహన కల్పిస్తుండగా..
న్యూస్టుడే, మేడిపల్లి(జగిత్యాల)
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహం అందిస్తూ ఇద్దరు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుస్తకాల ప్రచురణతో పాటు ఎలాంటి అంశాలు చదవాలనే విషయమై ఒకరు అవగాహన కల్పిస్తుండగా.. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి యూట్యూబ్ ద్వారా విలువైన సమాచారాన్ని చేరవేస్తూ మరొకరు చేదోడుగా ఉంటున్నారు. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో వీరి ప్రోత్సాహం బాగుందని ఉద్యోగార్థులు పేర్కొంటున్నారు.
యువకులకు తోడ్పాటు
మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఎనుగంటి సురేష్ హైదరాబాద్లో ప్రజ్ఞ పబ్లికేషన్స్ పేరిట పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈనాడు ప్రతిభ పేజీల్లో ఉద్యోగార్థుల కోసం పలు ఉపయోగకరమైన అంశాలను ఆయన రాశారు. ఆయన ప్రచురించిన పుస్తకాలు యువకులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. తన సంకల్పం నెరవేరేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పలు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పోటీ పరీక్షల నేపథ్యంలో యువకులకు ఉపయోగకరంగా ఉండే అంశాలను ఉచితంగానే అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సురేష్ ప్రచురించిన అంశాలు యువకులు షేర్ చేసుకుంటున్నారు. గ్రూప్1 నుంచి గ్రూప్4 వరకు సిలబస్లో పలు అంశాలు అన్ని పరీక్షలకు ఉమ్మడిగా ఉపయోగపడతాయని సురేష్ పేర్కొన్నారు. తెలుగు అకాడమీ వారి ప్రచురణలు, సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని వీలైనంత మేర పునశ్చరణ చేయాలని కోరారు. పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని, తెలంగాణ అంశాలు, భారతదేశ చరిత్ర, ఇతర అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కరెంట్ అఫైర్స్పై ప్రతిరోజూ దృష్టి పెట్టాలని, కష్టపడితే ఉద్యోగం తప్పకుండా వరిస్తుందని చెప్పారు.
ఆదర్శం.. ఆ అధికారి
కోరుట్ల మండలం జోగన్పల్లికి చెందిన పల్లికొండ నరేశ్ జిల్లా ఉపాధిహామీ ఏపీడీగా పనిచేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న ఆయన యూట్యూబ్ ద్వారా పలు అంశాలను వివరిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ‘నరేశ్ కెరీర్ గైడ్’ పేరిట యూట్యూబ్లో వీడియోలు పొందుపరుస్తూ ఉద్యోగార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రూప్1 అధికారి అయిన నరేశ్ ఉద్యోగ ప్రకటనల్లో వచ్చిన మార్పులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానం గురించి వివరిస్తున్నారు. వీటితో పాటు ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్పై పాఠాల రూపంలో పోస్టులు పెడుతున్నారు. సివిల్స్లో టాప్ ర్యాంకర్ల అభిప్రాయాలు, ఇతర సమాచారాన్ని బోధిస్తున్నారు. ఇటీవల ముగిసిన టెట్ పరీక్షపై నరేశ్ రూపొందించిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి ప్రకటనపై సమగ్ర వివరణ కూడా యువకులకు ఉపయోగపడింది. ఏయే శాఖల కింద ఎన్ని పోస్టులను ప్రభుత్వం నియమించనుంది? ఆయా పోస్టుల కోసం ఎలా చదవాలి? అనే అంశాలను నరేశ్ సమగ్రంగా వివరించారు. స్వతహాగా అధికారి కావడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమకు మంచి సమాచారం అందుబాటులోకి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో యువకులకు అండగా ఉండాలనే తన సంకల్పం నెరవేరిందని నరేశ్ పేర్కొన్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.