కుష్టు కబళిస్తోంది
పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్టు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేసిన వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ రోగులను గుర్తిస్తున్నారు.
జిల్లాలో మూడున్నర ఏళ్లలో బాధితులు 444
కోలుకున్న వారు 228
సర్వేలో వివరాలు తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది (పాతచిత్రం)
న్యూస్టుడే, మెట్పల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్టు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేసిన వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ రోగులను గుర్తిస్తున్నారు. వ్యాధిపై అవగాహన కల్పించి మందులు అందిస్తున్నారు. మరో వైపు అదే స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మూడున్నర సంవత్సరాల్లో 444 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. 228 మంది చికిత్స పొంది కోలుకున్నారు.
ముందుగా గుర్తిస్తే నయం
కుష్టు అంతగా అంటువ్యాధి కాదు. వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు సంక్రమిస్తుంది. పూర్తిగా నయం కాని జబ్బేమీ కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిని త్వరగా గుర్తించి మందులు వాడితే పూర్తిగా కోలుకోవచ్చని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే కబళించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి జీవించవచ్చు. కుష్టు లైంగికంగా సంక్రమించదు. గర్భం ద్వారా పుట్టబోయే బిడ్డకు వ్యాపించదు. వ్యాధి సోకిన వ్యక్తి ముక్కు ద్రవంతో దగ్గు లేదా స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధక శక్తిని బట్టి 95 శాతం మందికి వ్యాధి సోకిన అభివృద్ధి చెందదు. రెండు రకాల వ్యాధులు ఉంటాయి. పాసిబాసిల్లరీ వ్యాధి ఉన్న వ్యక్తికి శరీరంపై ఐదు రకాల మచ్చలు ఉంటాయి. మల్టీబాసిల్లరీ వ్యాధి సోకిన వ్యక్తి శరీరంపై ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటాయి. స్పర్శ ఉండదు. చర్మం బయాప్సీలో యాసిడ్ ఫాస్ట్ బాసిల్లిని కనుగొనడం వల్ల రోగాన్ని నిర్ధారిస్తారు.
ఉచితంగా సేవలు, మందులు
మల్టీడ్రగ్ థెరపీతో కుష్టు వ్యాధిని నయం చేసుకోవచ్చు. పాసిబాసిల్లరీ కుష్టుకు ఆరు నెలల పాటు డాప్సోన్, రిఫాంపిసిన్, క్లోఫాజిమైన్ మందులతో మల్టీచికిత్స అందిస్తారు. ఇవే మందులతో మల్టీబాసిల్లరీ వ్యాధిగ్రస్థులకు 12 నెలల పాటు చికిత్స అందిస్తారు. కుష్టు వ్యాధితో బాధపడే వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మందులు ఉచితంగా అందిస్తారు. జిల్లా ఆసుపత్రితోపాటు జిల్లాలోని సీహెచ్సీలు, అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలతోపాటు మందులు అందిస్తారు. శస్త్రచికిత్స అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి లేదా కూకట్పల్లిలోని శివానంద స్వచ్చంద సంస్థ ఆసుపత్రికి పంపిస్తారు. శస్త్రచికిత్సకు ప్రభుత్వం రూ.8వేల వంతున అందిస్తుంది.
చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్ శ్రీనివాస్, వ్యాధి నియంత్రణ జిల్లా అధికారి
సర్వేలు నిర్వహించి వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందిస్తున్నాం. సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. కుష్టును అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మొదటి దశలో ఉండగానే గుర్తిస్తే అంతే వేగంగా నయం చేసుకోవచ్చు. నియంత్రణకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. బాధితులు సహకరిస్తే నియంత్రణ మరింత సులువు అవుతుంది. కుష్టుపై భయం వీడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!