బైపాస్లో పారిశుద్ధ్యంపై నజర్
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్లో ర్యాంకులు సాధించడమే కాకుండా నగదు పురస్కారాలు దక్కించుకోవడంతో పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ
కార్మికుల కొరతతో సతమతం
ప్రత్యేక బృందంతోనే సాధ్యం
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
రామగుండం బైపాసురోడ్డులో చెత్తను తీసుకెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్లో ర్యాంకులు సాధించడమే కాకుండా నగదు పురస్కారాలు దక్కించుకోవడంతో పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు నగర వీధులు..ప్రధాన, అంతర్గత రహదారులకే శానిటేషన్ పరిమితం చేయకుండా..నగర శివారులోని బైపాసు రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. రామగుండం, సిరిసిల్ల బైపాసు, హౌసింగ్బోర్డుకాలనీ క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు, సుభాష్నగర్ వైపు, రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం లేకుండా చూడాలని పారిశుద్ధ్య విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ రోడ్లపై చెత్త కుప్పలు
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న బైపాసు రహదారులు చెత్త కుప్పలకు అడ్డాగా మారుతోంది. చికెన్ వ్యర్థాలు, చెత్తా చెదారం, శుభ కార్యాలు, వేడుకల సందర్భంగా వచ్చిన వ్యర్థాలన్నీ ఆటోల ద్వారా తీసుకొచ్చి రహదారులకు ఇరువైపులా పోస్తున్నారు. దాంతో అక్కడ పందులు, కుక్కలు చేరుకుని చెత్తంతా చిందర వందర చేస్తుండగా, రాకపోకలు సాగించే ప్రజలకు దుర్వాసన వెదజల్లుతోంది. ఇళ్ల ముందుకు రిక్షాలు, ట్రాక్టర్లు వస్తుండగా కార్మికులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం, ఇష్టానుసారంగా ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు.
హౌసింగ్బోర్డుకాలనీ వైపు రోడ్డు ఊడుస్తున్న కార్మికులు
కార్మికులు ఎక్కడ?
కరీంనగర్లో 60 డివిజన్లు ఉండగా ప్రస్తుతం 1056 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో డ్రైవర్లు, లోడర్లు, స్వీపర్లు, మురుగునీటి కాల్వలు శుభ్రం చేసే వారున్నారు. ఒక డివిజన్కు 8 నుంచి 10మంది కార్మికులు, ఒక స్ప్రే వర్కర్ ఉండగా, రెండు డివిజన్లకు ఒక ట్రాక్టర్ పని చేస్తోంది. అంటే ఒక డివిజన్కు ఒక ట్రాక్టర్ మూడు రోజులు వస్తుండగా ఆ సమయంలో రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారం, డ్రైనేజీల్లోంచి తీసిన పూడిక తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉండగా ప్రత్యేకంగా బైపాసుల వెంబడి పని చేసేందుకు కార్మికులు ఎక్కడ ఉన్నారనేదీ పెద్ద ప్రశ్నగా మారింది. డివిజన్లలో పని చేసే కార్మికులను అక్కడికి పంపిస్తే కార్పొరేటర్ల నుంచి లొల్లి ఉండగా, డివిజన్ల వారీగా చేపట్టే పనులపై ప్రభావం పడుతోంది. అక్కడ, ఇక్కడ పని చేయించాలంటే కత్తి మీద సాములాగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారీ వాహనాలతో భయం
బైపాసు రహదారుల వైపు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలంటే ఉన్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు చోట్ల ఏకకాలంలో పనులు చేయడం సాధ్యం కాకపోగా ఆ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. వేగంగా వచ్చి కార్మికుల మీదికి దూసుకెళితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుందని కార్మికులు అంటున్నారు. అన్ని బైపాసు రోడ్లపై పనులు చేసేలా ప్రత్యేకంగా ఒక వాహనం, కార్మికులను కేటాయించాలి. హెచ్చరికలతో కూడిన స్టాపర్లు ఏర్పాటు చేసుకునేలా చూడాల్సిన అవసరముంటుంది. ఆ విధంగా చేపడితే బైపాసు రోడ్లపై పారిశుద్ధ్య పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. ఈ విషయంలో నగర మేయర్ సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, పారిశుద్ధ్య విభాగం పర్యవేక్షకులు ఆ దిశగా ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!