ఇంటింటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీపై
కలెక్టరేట్లో జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం గర్వించేలా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 3,08,754, కరీంనగర్ కార్పొరేషన్లో 79,953 ఇళ్లపై జెండా ఎగురవేసి, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఆగస్టు 16న దేశభక్తిని పెంపొందిచే విధంగా ఎక్కడి వారక్కడ ఏకకాలంలో జాతీయ గీతాలాపన చేయాలన్నారు. 75 సంవత్సరాల దేశాభివృద్ధిని, దేశ పురోగతి, దేశ భక్తిని భావితరానికి చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించుకుందామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులకు జాతీయ జెండాలను అందజేశారు. జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జాతీయ జెండా ఎగురవేసిన చోట వివిధ పార్టీలకు సంబంధించిన జెండాలను ఎగుర వేయొద్దని పేర్కొన్నారు. అనంతరం మంత్రి, జిల్లా పాలనాధికారి, మేయర్ వై.సునీల్ రావు, సీపీ సత్యనారాయణలతో కలిసి భగత్నగర్లో ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కనుమల్ల విజయ, గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, అదనపు పాలనాధికారులు గరిమా అగ్రవాల్, శ్యామ్ప్రసాద్లాల్, ఉప మేయర్ చల్ల స్వరూపరాణి, కమిషనర్సేవా ఇస్లావత్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పతాకాల పంపిణీ ప్రారంభించిన మంత్రి
రాంపూర్(కరీంనగర్) : ప్రపంచ దేశాలు ఈర్ష్య పడేలా, దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మేయర్ సునీల్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న 32వ డివిజన్ భగత్నగర్లో ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం మంత్రి గంగుల ప్రారంభించారు. నగరంలో తలసేమియాతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా రక్తదానం, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ వై.సునీల్రావు, జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్, సీపీ సత్యనారాయణ, అదనపు పాలనాధికారులు గరిమా అగ్రవాల్, శ్యాంప్రసాద్లాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కమిషనర్ సేవా ఇస్లావత్, పలువురు తెరాస కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి, మేయర్ ఇంటింటికి వెళ్లి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్