logo

ఇంటింటా ఇన్నోవేటర్‌కు ఎనిమిది ఆవిష్కరణల ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో అత్యుత్తమంగా నిల్చిన ఎనిమిది ఆవిష్కరణలను జిల్లా స్థాయికి టీఎస్‌ఐసీ హైదరాబాద్‌ వారు ఎంపిక

Published : 14 Aug 2022 06:33 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో అత్యుత్తమంగా నిల్చిన ఎనిమిది ఆవిష్కరణలను జిల్లా స్థాయికి టీఎస్‌ఐసీ హైదరాబాద్‌ వారు ఎంపిక చేశారని జిల్లా సైన్స్‌ అధికారి సి.హెచ్‌.జయపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన రాకేశ్‌రెడ్డి, చిల్లా సాయిసృజన్‌, కె.అరుణ, ఆదిత్య, కొడూరి సాయి ప్రణతి, విజయకుమార్‌, పబ్బతి స్నిగ్ధ, డి.ప్రత్యూషలు రూపొందించిన ఆవిష్కరణలను ఎంపిక చేశారని చెప్పారు. వీరి ఆవిష్కరణలు ఈ నెల 15న కరీంనగర్‌లోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల స్టాల్స్‌లో ప్రదర్శిస్తారని తెలిపారు.  అదే రోజు జిల్లా పాలనాధికారి ద్వారా ప్రశంసా పత్రాలను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని