అనుమతుల్లేకుండా ఆసుపత్రుల నిర్వహణ
సిరిసిల్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరీక్షను బట్టి శస్త్రచికిత్సలు చేయాలి. కాగా పైపై పరీక్షలతో అందిస్తున్న వైద్యం ప్రాణాల మీదకు తెచ్చింది.
వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో బహిర్గతం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీ చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది
సిరిసిల్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరీక్షను బట్టి శస్త్రచికిత్సలు చేయాలి. కాగా పైపై పరీక్షలతో అందిస్తున్న వైద్యం ప్రాణాల మీదకు తెచ్చింది. వేములవాడలో అపెండిసైటీస్ ఆపరేషన్ వికటించడంతో యువకుడు వారం రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హైదరాబాద్లో మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవల్లో లోపాలతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనలు చేపట్టడంతో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విషయం బయటకు రాకుండా సద్దుమణిగేవి చాలా ఉంటాయి. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవలపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గత వారం వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు అనుమతిలేవి.. రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకోనివే ఎక్కువగా ఉన్నాయి.
జిల్లాలో ఏడాది నుంచి ప్రైవేటు ఆసుపత్రుల విస్తరణ పెరిగింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకే పరిమితమైన ఆసుపత్రులు ఇప్పుడు ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకూ విస్తరించాయి. జిల్లా వ్యాప్తంగా 119 ఆసుపత్రులు, నర్సింగ్హోంలు, పాలీక్లినిక్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు నడుస్తున్నాయి. అనధికారికంగా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటిలో కనీస నిబంధనలు పాటించడం లేదు. వైద్యఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అలాంటి వాటిని కట్టడి చేసే విషయమై వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వారం రోజులుగా ప్రతి ఆసుపత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించని 25 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 19 ఆసుపత్రులను అనుమతులు పొందకుండానే నడుపుతున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల అర్హతలేని నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండటం గమనార్హం. ఏవైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే మంటలార్పే వ్యవస్థ సైతం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్సలు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ధరల పట్టికలు సైతం ఏర్పాటు చేయడం లేదు.
అయిదు బృందాలతో తనిఖీలు..
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో మండల కేంద్రాల్లోని ఆసుపత్రులు, ల్యాబ్ల తనిఖీ లకు వైద్య ఆరోగ్యశాఖ అయిదు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో వైద్యఆరోగ్యశాఖ నుంచి ముగ్గురు అధికారులున్నారు. రిజిస్ట్రేషన్ లేనివాటికి... పాత రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాటికి నోటీసులు జారీ చేస్తున్నారు. నర్సింగ్ హోంలు, శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు బయోవ్యర్థాలను వేరు చేయడంలో నిబంధనలు పాటించకుంటే నోటీసులు జారీ చేస్తున్నారు. తనిఖీలు జరుగుతున్న తీరుపై జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్రావును ‘ఈనాడు’ సంప్రదించగా... అనుమతి లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్నవారు రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. తనిఖీల నివేదికను రోజువారీగా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు