దాహం తీరేదెలా?
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మూడేళ్ల కిందట పంచాయతీల నుంచి నగరంలోకి వచ్చినా ఇబ్బందులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి.
విలీన కాలనీల్లో తాగునీటి సమస్య
శంకుస్థాపన చేసినా పత్తా లేని పనులు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విద్యారణ్యపురి ప్రాంతం
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మూడేళ్ల కిందట పంచాయతీల నుంచి నగరంలోకి వచ్చినా ఇబ్బందులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి. రూరల్ మిషన్ భగీరథ కింద చేపట్టిన పైపులైన్ల విస్తరణ పనులు, ట్యాంకుల నిర్మాణం నామమాత్రంగా మారగా, ప్రస్తుత జనాభా, ఇళ్లకు తగ్గట్లూ నీటి సరఫరా చేయకపోవడం, కనెక్షన్లు ఇచ్చినా నిరుపయోగంగా మారడంతో ఆయా ప్రాంతవాసులు నానావస్థలు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నగర మేయర్ వై.సునీల్రావు భావించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.13 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మాత్రం నత్తనడకన సాగుతుండగా.. కొన్ని చోట్ల అసలే ప్రారంభించ లేదు.
బిందె నిండడానికి గంట
తీగలగుట్టపల్లి ప్రాంతంలోని సరస్వతీనగర్, విద్యారణ్యపురి ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నప్పటికీ బొట్టు నీరు రాదు. ఇక్కడ ఉన్న ట్యాంకు పంచాయతీ సమయంలో నిర్మించగా అదీ పేరుకే అన్నట్లుగా మారింది. దీనికి ఇన్, ఔట్ లెట్ కనెక్షన్లు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఇతర ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతాలకు సన్నని ధార వస్తుండగా ఒక బిందె నిండడానికి గంట సమయం పడుతుండటంతో ఆ ఒక బిందె నీరు ఏమూలకు సరిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఇళ్లలో ఉన్న బోరుబావులు ఎండిపోతుండగా జులై వరకు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే ట్రాక్ తర్వాత ఉన్న తీగలగుట్టపల్లి చంద్రపురి, కెఆర్ కాలనీ, రెడ్డిస్ కాలనీలు, ఎస్సీ కాలనీ, పాత వాడలకు పంచాయతీ హాయం నుంచి ఉన్న బావి నీరు, రూరల్ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని కలిపి రోజుకు నాలుగు ట్యాంకులు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కూడా ఆ ప్రాంతవాసులకు సరిపోవడం లేదు.
విద్యారణ్యపురి రోడ్డు నం.3లో కనెక్షన్లు లేకుండా నిర్మించిన ట్యాంక్
11 నెలల కిందట శంకుస్థాపన
తీగలగుట్టపల్లిలోని పలు కాలనీలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఈ ఏడాది జనవరి 10న సరస్వతీనగర్లో రూ.1.30 కోట్లతో పైపులైన్లు వేసేందుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు టెండర్లు అయి రెండేళ్లు దాటింది. మళ్లీ ఎండాకాలం ముంచుకొస్తుండగా పైపులైన్లు వేసి కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని గందరగోళంలో స్థానికులు ఉన్నారు. విలీన కాలనీల్లో తాగునీరు మెరుగు పర్చడానికి కొత్తగా వేస్తున్న పైపులైను పనులు సీతారాంపూర్లో 50శాతం మాత్రమే పూర్తయ్యాయి. శుభం గార్డెన్, సూర్యనగర్ ప్రాంతానికి పైపులైను వేయాల్సి ఉంది. తీగలగుట్టపల్లిలో అసలే ప్రారంభించకపోగా, రేకుర్తిలో కొంత పైపులైను విస్తరణ చేపట్టారు.
కనెక్షన్లు ఇచ్చి మూడేళ్లు
ఇంటింటా నల్లా కనెక్షన్లు ఇచ్చి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అందుల్లోంచి నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. పైపులైన్లు వేస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైతే కనిపించడం లేదు. సరస్వతీనగర్లో ఎండాకాలం వచ్చిందంటే బోర్లు అడుగంటిపోతాయి. నీళ్ల కోసం అవస్థలు పడాల్సిందే. నల్లా నీరు వచ్చేలా చూడాలి.
బి.సుగుణ, స్థానికురాలు
గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి
శంకుస్థాపనలు చేసిన తర్వాత పనులు ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని మేయర్, కమిషనర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అదిగో, ఇదిగో, వారాల పేర్లు చెబుతూ గుత్తేదారు పనులు చేయకుండా దాటేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని పనులు ప్రారంభించాలి.
కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!