ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటయ్యేనా..?
ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికంగా నిర్వహణ గాడి తప్పడంతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
గాడి తప్పిన నిర్వహణ
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి
ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికంగా నిర్వహణ గాడి తప్పడంతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి నిర్వహణలో కీలకపాత్ర పోషించాల్సిన సూపరింటెండెంట్ సేవలు నామమాత్రమే కాగా వైద్య కళాశాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ ఆసుపత్రి నిర్వహణను చూస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మార్పులు కనిపించడం లేదు. నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. జిల్లా కలెక్టర్ను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసినా ఇంతవరకూ పూర్తిస్థాయి కమిటీ నియామకం జరగడం లేదు. ఈ కారణంగా ఆస్పత్రిలో పర్యవేక్షణ ఏకపక్షంగా సాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఆసుపత్రి నిర్వహణ పర్యవేక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం. స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి సమర్థులను సూపరింటెండెంÆట్గా నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేసినప్పటికీ ఆశించిన పురోగతి లేదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు కావాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో జిల్లా పరిషత్తు ఛైర్మన్, ఆసుపత్రి పరిధిలోకి వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, ఎంపీలతో పాటు వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ ఏర్పాటు జరిగితే సభ్యులుగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు ఆసుపత్రి నిర్వహణపై దృష్టి సారించే అవకాశముంది. ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నప్పుడు జిల్లా ఆసుపత్రుల నిర్వహణ పర్యవేక్షకులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్పుడప్పుడూ సందర్శిస్తూ నిర్వహణపరమైన ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకున్నారు. కాగా సార్వజనిక ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులున్నా రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులే ప్రధాన దృష్టి సారించాల్సి ఉండడంతోనే ఆసుపత్రి నిర్వహణపై ఆశించిన పర్యవేక్షణ ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరవడిన సమన్వయం...
దవాఖానా నిర్వహణను పర్యవేక్షించాల్సిన రెసిడెంÆÆట్ మెడికల్ అధికారుల్లో ఒకరిద్దరు పెద్దగా పట్టించుకోకపోగా ఒకరిద్దరు అత్యుత్సాహంతో కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వైద్య విధాన పరిషత్తునకు చెందిన సిబ్బందిపై వివక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయా వర్గాల నుంచి ఆవేదనలు వినిపిస్తున్నాయి. తమను వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులకు బదిలీ చేయాలంటూ ఇటీవల కొందరు ఉద్యోగులు జిల్లా స్థాయి అధికారులను వేడుకోవడం గమనార్హం. ఆసుపత్రి నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేని ఓ ఒప్పంద కార్మికుడు నిర్వహణపై పెత్తనం చేస్తుండడం వారిని మరింత వేదనకు గురి చేస్తుంది. ఒప్పంద కార్మికుల నియామకంలో వసూళ్లపర్వం తెరపైకి రాగా విషయం పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. కొన్ని విభాగాల్లో మందులతో పాటు ప్రయోగశాలల్లో అవసరమైన సామగ్రి, రసాయనాలు లేకపోవడంతో అత్యవసరమైతే తప్ప ఆయా పరీక్షలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒప్పంద విధానంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు సైతం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!