పరిశీలించండి.. పరిష్కరించండి
సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 215 దరఖాస్తులను...
ప్రజావాణికి 215 దరఖాస్తులు
అర్జీలను స్వీకరిస్తున్న అదనపు పాలనాధికారులు శ్యాంప్రసాద్లాల్, గరిమ అగ్రవాల్
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 215 దరఖాస్తులను అదనపు పాలనాధికారులు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమ అగ్రవాల్ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను ఇస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లక్షల్లో పంచాయతీ బకాయిలు
ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు అందాల్సిన నిధులు ఇప్పించాలని జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు తాగునీరు, సీసీ రోడ్లు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు తదితర పనులు చేశామన్నారు. ఒక్కో గ్రామానికి రావాల్సిన నిధుల బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం నుంచి అందేలా చూడాలని రామడుగు మండలం గోపాల్రావుపేట సర్పంచి కర్ర సత్యప్రసన్నరెడ్డితోపాటు జిల్లాలోని పలు మండలాల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
మీటరు మంజూరు చేయడం లేదు
భగత్నగర్లో ఇంటి నిర్మాణానికి టీఎస్బీపాస్ ద్వారా జనవరి 25 అధికారులు అనుమతిచ్చారని, ఇంటి నిర్మాణానికి విద్యుత్తు శాఖకు మీటరు కోసం దరఖాస్తు చేసుకున్నా.. మీటరు మంజూరు చేయడంలేదని రాజిరెడ్డి దంపతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. పరిశీలించిన అదనపు కలెక్టర్ మీటరు మంజూరు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ..
కొత్తపల్లి విత్తన గోదాంను వైద్య కళాశాలగా మార్చుతుండడంతో అందులో పని చేసే కార్మికులం ఉపాధి కోల్పోతున్నామని, నూతనంగా నిర్మిస్తున్న కళాశాలలో ఏదైనా ఉపాధి చూపించాలని 14 మంది విన్నవించుకున్నారు. విత్తన గోదాంలో వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉండేవని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సరోజన, అరుణ, కోమల, రేణుక, జి.లావణ్య, బి.నర్మద, బి.రజని, మాధవి ఇతర కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడాలని..
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారులో 26 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్థానికేతరుల పేర్లు ధరణిలో వస్తున్నాయని, వారి పేర్లను తొలగించి స్థానిక నిరుపేదలకు ఆ భూమిని కేటాయించాలని అమర్నాథ్ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూ కుంభకోణంలో సంబంధిత అధికారులు, స్థిరాస్తి వ్యాపారులు కుమ్మక్కై భూమి కొట్టేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
డీపీవోపై చర్యలు తీసుకోండి
కొత్తపల్లి మండలం ఎల్గందల్లో స్థానిక కారోబార్, మరికొంత మంది ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారని, విచారణలో అది నిజమని తేలినా డీపీవో చర్యలు తీసుకోవడంలేదని ఎల్గందల్ ఎంపీటీసీ సభ్యుడు, సుడా డైరెక్టర్ మంద రమేశ్గౌడ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయని డీపీవోపై చర్యలు తీసుకోవాలన్నారు.
దాదాపు 2 గంటల నిరీక్షణ
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం గ్రామ పంచాయతీల పురస్కార కార్యక్రమం నిర్వహించడంతో ప్రజావాణి ఫిర్యాదుదారులంతా ఉదయం 11.45 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆలస్యంగా ప్రజావాణి ప్రారంభం కావడంతో దూర ప్రాంతాల నుంచి 10 గంటలకు వచ్చిన వారు నిరీక్షించాల్సి వచ్చింది. చెకింగ్ పాయింట్ నుంచి గుంపులుగా లోపలకు రావడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజావాణి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుందని అక్కడికి వచ్చిన ప్రజలు పేర్కొన్నారు.
శాఖల వారీగా ఇలా..
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం : 18
కరీంనగర్ గ్రామీణ తహసీల్దార్ : 47
తహసీల్దార్ మానకొండూర్ 14
ఆర్డీవో కార్యాలయానికి 4 నగర పాలక సంస్థ : 13
వారధి విభాగం : 8
ఇతర శాఖల నుంచి : 111 ఫిర్యాదులు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత