ఫైరింగ్లో ఉత్తమం.. పదోన్నతిలో ప్రథమం
తుపాకీ గురి పెడితే...లక్ష్యం చేరుకోవాల్సిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్సీసీ అధికారులకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇటీవల నిర్వహించిన శిక్షణలో అందరికంటే ఫైరింగ్లో మొదటి స్థానంలో నిలిచింది గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ సెకండ్ అధికారిణి జ్యోత్స్న.
న్యూస్టుడే, మార్కండేయకాలనీ
తుపాకీ శిక్షణ పొందుతున్న ఎన్సీసీ అధికారిణులు
తుపాకీ గురి పెడితే...లక్ష్యం చేరుకోవాల్సిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్సీసీ అధికారులకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇటీవల నిర్వహించిన శిక్షణలో అందరికంటే ఫైరింగ్లో మొదటి స్థానంలో నిలిచింది గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ సెకండ్ అధికారిణి జ్యోత్స్న. ఆ ప్రతిభే ఆమెకు ఫస్ట్ ఆఫీసర్గా పదోన్నతి దక్కేలా చేసింది.
110మంది అధికారుల్లో..
జనవరి 30వ తేదీ నుంచి 20 రోజులపాటు గ్వాలియర్ ఎన్సీసీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ(వోటీఏ) నిర్వహించిన శిక్షణ శిబిరంలో 28 రాష్ట్రాల నుంచి 110 మంది ఎన్సీసీ అధికారుల్లో తెలంగాణ తరఫున జ్యోత్స్న పాల్గొన్నారు. మ్యాప్రీడింగ్, పాఠ్యాంశ బోధన, డ్రిల్ పరీక్ష, యోగా, ఫైరింగ్ విభాగంలో శిక్షణ పొందారు. అనంతరం ప్రతిభా పరీక్షల్లో ఫైరింగ్ విభాగంలో ఐదురౌండ్ల టార్గెట్ పూర్తి చేయడంతో ప్రథమస్థానం కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ట్రైనింగ్ కమాండెంట్ బ్రిగేడియర్ శర్మ చేతుల మీదుగా ఎక్స్లెన్స్ ఫైరింగ్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం
సెక్రెడ్ హార్ట్ ఉన్నత పాఠశాలకు ఎనిమిదేళ్ల క్రితం ఎన్సీసీ శిక్షణ కేంద్రం నిర్వహణకు అనుమతి వచ్చింది. శిబిరానికి శిక్షకురాలిగా ఎంపికవ్వటం కోసం గ్వాలియర్ ఎన్సీసీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో మూడు నెలలు పాటు జ్యోత్స్న శిక్షణ పొందారు. ఏటా 8, 9వ తరగతి విద్యార్థుల్లో 50 మందిని ఎన్సీసీ క్యాడెట్లుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. యేటా మూడు శిబిరాలు(సీఏటీసీ) కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ -1, 2, 3 లతో పాటు బెటాలియన్ యూనిట్ క్యాంపులు కరీంనగర్, సంగారెడ్డి, తిరుపతి, హైదరాబాద్లలో నిర్వహించే శిబిరాలకు విద్యార్థులు వెళుతున్నారు.
ప్రతి విద్యా సంవత్సరం యూనిట్ క్యాంపుల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లను ఇంటర్ గ్రూపు కాంపిటీషన్(ఐజీసీ), ప్రీ రిపబ్లిక్ డే(పీఆర్డీ)వరకు సంసిద్ధం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసేలా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే శిబిరానికి విద్యార్థులు జాహ్నవి, రిత్వికా, వైభవ్లు ఎంపికయ్యారు.
ప్రజలకు సేవ చేయాలనే తపన
జ్యోత్స్న, ఎన్సీసీ అధికారిణి
చిన్నప్పటి నుంచి యూనిఫాం దుస్తులతోనే ప్రజలకు సేవచేసే అవకాశం లభిస్తుందని చాలా శ్రమించినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించ లేకపోయా. దీంతో ఎన్సీసీ అధికారిణిగా శిక్షణ పొందాను. ఇప్పటి వరకు ఎంతోమందిని ఎన్సీసీ క్యాడెట్లుగా తీర్చిదిద్దా. ఇటీవల నిర్వహించిన శిక్షణలో ఫైరింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఎన్సీసీ రెండవ ఆఫీసర్ నుంచి ప్రథమ ఆఫీసర్గా పదోన్నతి లభించడం ఆనందంగా ఉంది. ఎన్సీసీ క్యాడెట్లకు ప్రతి అంశాన్ని వివరిస్తూ ప్రత్యేక శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వారు ఉన్నతంగా రాణించే విధంగా మెలకువలు నేర్పుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్